IPL 2025 Final : జూన్ 3న గుజ‌రాత్ లో ఐపీఎల్ ఫైనల్

ప్ర‌క‌టించిన భార‌త క్రికెట్ కంట్రోల్ బోర్డు

IPL 2025 Final

IPL 2025 Final : ముంబై – భార‌త క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. భార‌త్, పాకిస్తాన్ దేశాల మ‌ధ్య కాల్పుల విర‌మ‌ణ ఒప్పందం జ‌ర‌గ‌డంతో టాటా ఐపీఎల్(IPL 2025 Final) లో వాయిదా వేసిన మ్యాచ్ ల‌ను నిర్వ‌హించ‌నున్న‌ట్లు స్ప‌ష్టం చేశారు బీసీసీఐ కార్య‌ద‌ర్శి జే షా. ఈ మేర‌కు వ‌చ్చే జూన్ 3న గ‌తంలో ప్ర‌క‌టించిన షెడ్యూల్ లో పేర్కొన్న‌ట్లు కోల్ క‌తా లోని ఈడెన్ గార్డెన్స్ లో నిర్వ‌హించ‌డం లేద‌న్నారు.

IPL 2025 Final Match in Gujarat

ఈ సంద‌ర్బంగా భ‌ద్ర‌తా కార‌ణాల రీత్యా, కేంద్ర స‌ర్కార్ సూచించిన మేర‌కు ఫైన‌ల్ మ్యాచ్ వేదిక‌ను మార్చిన‌ట్లు చెప్పారు. మంగ‌ళ‌వారం జే షా మీడియాతో మాట్లాడారు. గుజ‌రాత్ లోని అహ్మ‌దాబాద్ మోదీ స్టేడియం వేదిక‌గా ఐపీఎల్ ఫైన‌ల్ మ్యాచ్ ను నిర్వ‌హిస్తామ‌ని తెలిపారు. ఇదిలా ఉండ‌గా ఇప్ప‌టి వ‌ర‌కు ఐపీఎల్ 18వ సీజ‌న్ లో మొత్తం 10 జ‌ట్లు పాల్గొన్నాయి. ఇప్ప‌టికే ప‌లు జ‌ట్లు టోర్నీ నుంచి నిష్క్ర‌మించాయి. ఇక ప్లే ఆఫ్స్ కు ఏ జ‌ట్లు చేరుకుంటాయ‌నే దానిపై ఉత్కంఠ నెల‌కొంది.

గ‌తంలో నిర్వహించిన ఐపీఎల్ కు భిన్నంగా ఈసారి అంచ‌నాల‌కు అంద‌ని విధంగా జ‌ట్లు అద్బుత‌మైన ప్ర‌తిభా పాట‌వాల‌తో దూసుకు వెళ్లాయి. ఈ సారి ఏ జ‌ట్లు ఫైన‌ల్ కు వెళ‌తాయ‌నే దానిపై బెట్టింగ్ లు జోరందుకున్నాయి. మొత్తంగా ఫైన‌ల్ మ్యాచ్ మాత్రం క్రికెట్ ఫ్యాన్స్ కు మ‌రింత సంతోషాన్ని క‌లిగిస్తుంద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.

Also Read : Hero Santhanam : కోలీవుడ్ హీరో సంతానంపై సీరియ‌స్

Leave A Reply

Your email address will not be published.

Social Media Auto Publish Powered By : XYZScripts.com