అందరి కళ్లు గుజరాత్ లోని అహ్మదాబాద్ పై. ఇదే వేదికగా కీలకమైన ఐపీఎల్ 2025 ఫైనల్ మ్యాచ్ జరగనుంది. క్వాలిఫయర్ -1లో పంజాబ్ ను ఓడించి దర్జాగా ఫైనల్ కు చేరుకుంది. అయితే మరో బలమైన జట్టుకు చుక్కలు చూపించింది పంజాబ్ కింగ్స్ ఎలెవన్. నేరుగా బెంగళూరుతో పడేందుకు సిద్దమైంది పంజాబ్. నువ్వా నేనా అన్న రీతిలో పోటీ కొనసాగనుంది. ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది ఫ్యాన్స్ ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు.
జట్టు పరంగా చూస్తే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) సూపర్ షోతో బలంగా ఉంది ఈ మెగా 18వ ఐపీఎల్ సీజన్ టోర్నీలో . ఇప్పటి వరకు ప్రారంభమైనా ఒక్కసారి కూడా కప్ గెలవలేదు. మరో వైపు తనతో తలపడే జట్టు పంజాబ్ కూడా కప్ ను చేజిక్కించు కోలేక పోయింది. ఆర్సీబీ సూపర్ షోతో ఆకట్టుకుంది. చెన్నై , కోల్ కతా , తదితర జట్లకు ఝలక్ ఇచ్చింది.
బెంగళూరు జట్టులో ప్రధానంగా ఫుల్ ఫామ్ లో ఉన్నాడు మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ. తనతో పాటు సాల్ట్ , కెప్టెన్ రజత్ పాటిదార్, జితేశ్ శర్మ, టిమ్ డేవిడ్, లివింగ్ స్టోన్ లాంటి దిగ్గజ ఆటగాళ్లతో బలంగా ఉంది. ఈ సీజన్ లో అద్భుతంగా ఆడాడు విరాట్. తను 14 ఇన్నింగ్స్ లలో 614 రన్స్ చేశాడు. ఇక బౌలింగ్ పరంగా చూస్తే హాజిల్ వుడ్, భువి, యశ్ దయాల్ సీమర్స్ తో పాటు కృనాల్ , సుయాశ్ వంటి స్పిన్నర్లు కీలకంగా ఉండనున్నారు. మొత్తంగా ఇటు బౌలింగ్ లో అటు బ్యాటింగ్ లో ఫుల్ కాన్ఫిడెన్స్ తో ఉంది బెంగళూరు. ఎలాగైనా సరే కప్ ఎగరేసుకు పోవాలని అనుకుంటోంది.