ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్ మిలిటరీ చీఫ్ ఖ‌తం

అధికారికంగా ధ్రువీక‌రించిన ఇరాన్ ఆర్మీ వ‌ర్గాలు

ఇరాన్ – ఎవ‌రూ ఊహించ‌ని రీతిలో ఇజ్రాయెల్ వైమానిక దాడుల‌తో విరుచుకు ప‌డింది ఇరాన్ పై. త‌న‌ను టార్గెట్ చేస్తూ వ‌స్తున్న ఆ దేశాన్ని ఈ ప్ర‌పంచంలోనే లేకుండా చేస్తానంటూ వార్నింగ్ ఇచ్చారు ఇజ్రాయెల్ ప్రెసిడెంట్. దీంతో ఇరు దేశాల మ‌ధ్య వార్ కొన‌సాగుతోంది గ‌త కొంత కాలంగా. కాగా ఈ దాడుల‌తో త‌మ‌కు ఎలాంటి సంబంధం లేద‌ని పేర్కొంది అమెరికా. ఆ దేశ విదేశాంగ శాఖ మంత్రి కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. మ‌రో వైపు ఆపరేషన్ రైజింగ్ లయన్‌లో భాగంగా ఇజ్రాయెల్ జ‌రిపిన ఏక‌ప‌క్ష‌దాడుల్లో IRGC అధిపతి హుస్సేన్ సలామీ మరణించారు. ఈ విష‌యాన్ని ఇరాన్ ధృవీకరించింది.

శుక్రవారం తెల్లవారుజామున డజన్ల కొద్దీ ఇజ్రాయెల్ విమానాలు ల‌క్ష్యంగా చేసుకున్నాయి. ఇరాన్ అణు స్థావ‌రాల‌ను టార్గెట్ చేశాయి. ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) కమాండర్-ఇన్-చీఫ్ మేజర్ జనరల్ హొస్సేన్ సలామీ జనవరి 22, 2023న ఇరాన్‌లోని టెహ్రాన్‌లో జరిగిన పార్లమెంట్ సమావేశంలో ప్రసంగించారు. ఇజ్రాయెల్ కు త‌గిన రీతిలో బుద్ది చెబుతామంటూ హెచ్చ‌రించారు. దీంతో ఇజ్రాయెల్ త‌న‌ను ల‌క్ష్యంగా చేసుకుంది..హ‌త మార్చింది.

ఇదిలా ఉండ‌గా ఇజ్రాయెల్ దాడికి బ‌దులు తీర్చుకుని తీరుతామంటూ ఇరాన్ ప్ర‌క‌టించింది. త‌మ‌తో పెట్టుకుంటే బాగుండ‌ద‌ని వార్నింగ్ ఇచ్చింది. కావాల‌ని ప‌దే ప‌దే ఇజ్రాయెల్ ఏక‌ప‌క్షంగా దాడుల‌కు దిగుతోంద‌ని ఆరోపించింది. ప్ర‌తీకార చ‌ర్య‌లు త‌ప్ప‌వ‌ని, ఇందుకు త‌గిన మూల్యం చెల్లించు కోవాల్సి ఉంటుంద‌ని స్ప‌ష్టం చేసింది ఇరాన్.

Leave A Reply

Your email address will not be published.

Social Media Auto Publish Powered By : XYZScripts.com