Hero Sunny Deol-Jaat :జాట్ వివాదాస్ప‌దం స‌ర్వ‌త్రా ఆగ్ర‌హం

మ‌త ప‌ర‌మైన ఎదురు దెబ్బ‌..కేసు న‌మోదు

Jaat : మైత్రీ మూవీ మేక‌ర్స్ నిర్మాణ సార‌థ్యంలో గోపిచంద్ మ‌లినేని ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన జాట్ మూవీ విడుద‌లైంది. బాక్సాఫీస్ వ‌ద్ద స‌క్సెస్ టాక్ తెచ్చుకుంది. విడుద‌లై నాటి నుంచి నేటి దాకా రూ. 75 కోట్ల‌కు పైగా వ‌సూలు చేసింది. స్టార్ హీరో స‌న్నీ డియోల్ , ర‌ణ దీప్ హూడా, రెజీనా కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. గ‌తంలో ఎన్న‌డూ లేని రీతిలో స‌న్నీ, హూడా మ‌ధ్య చిత్రీక‌రించిన పోరాట స‌న్నివేశాలు ప్రేక్ష‌కుల‌ను థియేట‌ర్ల వ‌ద్ద‌కు ర‌ప్పించేలా చేశాయి. సినిమా ప‌రంగా హింస ఎక్కువ‌గా ఉన్న‌ప్ప‌టికీ స‌న్నీని గ‌తంలో ఏ ద‌ర్శ‌కుడు చూపించ‌ని రీతిలో ఎలివేట్ చేయ‌డంలో స‌క్సెస్ అయ్యాడు.

Jaat Movie Updates

అయితే తాజాగా జాట్(Jaat) చిత్రంపై పెద్ద ఎత్తున విమ‌ర్శ‌లు వెల్లువెత్తాయి. ప్ర‌ధానంగా కొన్ని వ‌ర్గాల‌ను కించ ప‌రిచేలా ఉందంటూ ఆగ్ర‌హం వ్య‌క్తం అవుతోంది. ఇక త‌మిళ‌నాడులో అయితే ఏకంగా దీనిపై తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం అవుతోంది. అంతే కాకుండా చిత్రాన్ని బేష‌ర‌తుగా నిషేధించాల‌నే డిమాండ్ పెరిగింది. ఇంకో వైపు వివాదాల‌కు కేంద్ర బిందువు కావ‌డంతో కేసు కూడా న‌మోదైంది. ఇక్క‌డ జాట్ కు ఎదురు దెబ్బ త‌గిలింది. ఈ స‌మ‌యంలో ఇది పూర్తి స్థాయిలో జాతీయ స‌మ‌స్య‌గా మార‌డం ఒకింత విస్తు పోయేలా చేసింది.

క్రైస్త‌వ సంఘాలు జాట్ పై భ‌గ్గుమంటున్నాయి. పంజాబ్ లోని జ‌లంధ‌ర్ లో చిత్ర బృందంపై పోలీస్ కేసేఉ న‌మోదైంది. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేక‌ర్స్ తో పాటు పీపుల్స్ మీడియా ఫ్యాక్ట‌రీ క‌లిసి నిర్మించింది. త‌మిళ హ‌క్కుల కోసం పోరాడిన ఎల్టీటీఈని ఉగ్ర‌వాద సంస్థ‌గా చిత్రీక‌రించ‌డంపై తీవ్ర స్తాయిలో వ్య‌తిరేక‌త వ్య‌క్త‌మైంది. చ‌ర్చి లోప‌ల చిత్రీక‌రించిన నిర్దిష్ట స‌న్నివేశాల‌పై క్రైస్త‌వ సంఘాలు త‌ప్పు ప‌ట్టాయి. ఆందోళ‌న వ్య‌క్తం చేశాయి. మ‌త ప‌ర‌మైన భావాలను కించ ప‌రిచేలా చేశారంటూ ఆరోపించారు. అయితే దీనిపై చిత్ర నిర్మాత‌లు, ద‌ర్శ‌కుడు ఇంకా స్పందించ లేదు.

Also Read : Anurag Kashyap Sensational :స‌ర్వ‌త్రా ఆందోళ‌న డైరెక్ట‌ర్ క్ష‌మాప‌ణ

Leave A Reply

Your email address will not be published.

Social Media Auto Publish Powered By : XYZScripts.com