Jaat : మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణ సారథ్యంలో డైనమిక్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని దర్శకత్వం వహించిన చిత్రం జాట్ దుమ్ము రేపుతోంది. ఇప్పటికే ఈ మూవీ రూ. 75 కోట్లకు పైగా వసూలు చేసింది వరల్డ్ వైడ్ గా. ఇందులో కీలక పాత్రలు పోషించారు బాలీవుడ్ సూపర్ స్టార్స్ సన్నీ డియోల్, రణ దీప్ హూడా, రెజీనా కసాండ్రా. ఎస్ఎస్ థమన్ మ్యూజిక్ అందించారు. సన్నీ కెరీర్ లోనే అత్యధిక వసూలు చేసిన చిత్రంగా నిలిచి పోతుందని సినీ వర్గాలు పేర్కొంటున్నారు. టాలీవుడ్ నుంచి తొలిసారిగా బాలీవుడ్ లో మూవీ చేశాడు గోపీచంద్ మలినేని.
Jaat Huge Collections
అయితే ఈ సినిమా ఎంతగా జనాదరణ పొందిందో అంతకు మించి వివాదాలను మూటగట్టుకుంది. కొన్ని వర్గాల మనోభావాలు దెబ్బతినేలా ఉన్నాయంటూ రోడ్డు ఎక్కారు. పంజాబ్ లోని జలంధర్ లో జాట్(Jaat) మూవీ బృందంపై ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. సినిమాలో చర్చి సన్నివేశాలలో తమను కించ పరిచేలా చేశారంటూ క్రైస్తవ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఇదే సమయంలో తమిళుల రక్షణ కోసం, ప్రత్యేక హోదా కావాలంటూ పోరాడిన ఎల్టీటీఈకి వ్యతిరేకంగా ఉండడం పట్ల తమిళనాడులో సినిమాను బ్యాన్ చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు.
అయినా జాట్ ఎక్కడా ఆగడం లేదు. కాసుల వర్షం కురిపిస్తోంది. విడుదలైన అన్ని చోట్లా ఆదరణ చూరగొంటోంది. మరో వైపు అక్షయ్ కుమార్ నటించిన చాప్టర్ 2 కూడా రిలీజ్ అయ్యింది. దీంతో సన్నీ మూవీపై కొంత ఎఫెక్ట్ పడింది. చాప్టర్ వెయ్యి స్క్రీన్లను పంచుకుంది. జాట్ 9వ రోజు రూ. 3.95 కోట్లు వసూలు చేసింది. రాబోయే రోజుల్లో ఇంకెన్ని కోట్లు వసూలు చేస్తుందనేది వేచి చూడాలి.
Also Read : Hero Nani-Director Sujith :డైరెక్టర్ సుజీత్ తో నాని మూవీ కన్ ఫర్మ్