సీక్వెల్ ని తెర‌కెక్కిస్తే న‌టించేందుకు సిద్దం

అందాల ముద్దుగుమ్మ జాన్వీ క‌పూర్ కామెంట్స్

శ్రీ‌దేవి, బోనీ క‌పూర్ ముద్దుల కూతుళ్లు సంచ‌ల‌నంగా మారారు. జాన్వీ క‌పూర్ ఇప్పుడు బాలీవుడ్ లో బిజీగా ఉన్నారు. ప‌లు సినిమాల‌లో న‌టిస్తూ ముందుకు దూసుకు వెళుతున్నారు. త‌న త‌ల్లి న‌ట వార‌సత్వాన్ని పుణికి పుచ్చుకున్నారు. ఇటీవ‌లే జూనియ‌ర్ ఎన్టీఆర్ తో క‌లిసి దేవ‌ర‌లో న‌టించింది. దీనికి కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వం వహించాడు. ఇది బ్లాక్ బ‌స్ట‌ర్ గా నిలిచింది. ఆ త‌ర్వాత మ‌రో సూప‌ర్ హీరోతో జ‌త క‌ట్టేందుకు ఓకే చెప్పేసింది. షూటింగ్ లో కూడా పాల్గొంటోంది. ఆ సినిమానే పెద్ది.

ఇందులో కీ రోల్ పోషిస్తున్నాడు రామ్ చ‌ర‌ణ్. ఇప్ప‌టికే ఈ సినిమాకు సంబంధించి కీల‌క అప్ డేట్ వ‌చ్చేసింది. ద‌ర్శ‌కుడు బుచ్చిబాబు స‌న పూర్తిగా గ్రామీణ నేప‌థ్యంగా తెర‌కెక్కించే ప్ర‌య‌త్నం చేస్తున్నాడు. త‌ను గ‌తంలో తీసిన ఉప్పెన్ సూప‌ర్ హిట్ గా నిలిచింది. త‌ర్వాతి చిత్రం పెద్ది. దీని గ్లింప్స్ ను ఇటీవ‌లే బ‌య‌ట‌కు వ‌దిలాడు. ఇది మెగా ఫ్యాన్స్ ను పిచ్చి ఎక్కించేలా చేసింది. దీంతో ఈ మూవీపై అంచ‌నాలు మ‌రింత పెరిగాయి.

తొలి షెడ్యూల్ క‌ర్ణాట‌క ప‌రిస‌ర ప్రాంతాల‌లో తీశాడు ద‌ర్శ‌కుడు. రెండో పార్ట్ ప్ర‌స్తుతం హైద‌రాబాద్ లో షూటింగ్ శ‌ర‌వేగంగా కొన‌సాగుతోంది. ఇక జాన్వీ క‌పూర్ న‌ట‌న ప‌రంగా ఒక్కో మెట్టు ఎక్కుతూ వెళుతోంది. ఈ సంద‌ర్బంగా ఇటీవ‌ల త‌న త‌ల్లి శ్రీ‌దేవి న‌టించిన జ‌గ‌దేక వీరుడు అతిలోక సుంద‌రి చిత్రం రీ రిలీజ్ అయ్యింది. ఈ సంద‌ర్బంగా ఇందుకు సంబంధించిన డెనిమ్ జీన్స్ ష‌ర్ట్ ను ధ‌రించింది. చిట్ చాట్ సంద‌ర్బంగా సీక్వెల్ గ‌నుక తీస్తే త‌ప్ప‌కుండా న‌టిస్తాన‌ని చెప్పేసింది జాన్వీ క‌పూర్.

Leave A Reply

Your email address will not be published.

Social Media Auto Publish Powered By : XYZScripts.com