ముంబై – స్టార్ పేసర్ స్పీడ్ స్టర్ గా పేరు పొందిన జస్ప్రీత్ బుమ్రా కోలుకోలేని షాక్ ఇచ్చాడు. శనివారం ముంబై వేదికగా భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు సెలెక్షన్ కమిటీ చైర్మన్ అజిత్ అగార్కర్, హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ తో పాటు బీసీసీఐ పెద్దలు కీలక సమావేశం కానున్నారు. భారత జట్టు ఇంగ్లండ్ టూర్ కు వెళ్లనుంది. ఈ మేరకు ఇవాళ టెస్టు స్క్వాడ్ ను ఎంపిక చేయనున్నారు. ఇంతలోపే బుమ్రా చేదు వార్త చెప్పాడు.
టాప్ ప్లేయర్స్ రోహిత్ శర్మతో పాటు విరాట్ కోహ్లీ తాము టెస్టు ఫార్మాట్ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. దీంతో వారి స్థానాలను ఎవరితో భర్తీ చేయాలనే దానిపై మల్లగుల్లాలు పడుతున్నారు. మరో వైపు బీసీసీఐ సంచలన ప్రకటన చేసింది. రోహిత్ శర్మ స్థానంలో స్పీడ్ బౌలర్ బుమ్రాకు నాయకత్వ బాధ్యతలు అప్పగిస్తున్నట్లు వెల్లడించింది. అధికారికంగా ధ్రువీకరించింది కూడా.
ఈ తరుణంలో ఉన్నట్టుండి కీలక టూర్ కు బుమ్రా దూరంగా ఉంటానంటూ ప్రకటించడంతో ఎవరిని ఎంపిక చేయాలనే దానిపై మల్లగుల్లాలు పడుతోంది. తనకు ఆరోగ్యం సహకరించడం లేదంటూ పేర్కొన్నాడు. ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకోవాలని బీసీసీఐకి లేఖ రాశాడు. అయితే పూర్తిగా ఫిట్ నెస్ ఉంటేనే జట్టులోకి ఆటగాళ్లను తీసుకుంటున్నారు . దీనిని కచ్చితంగా అమలు చేస్తోంది బీసీసీఐ.