దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి సంచలన ప్రకటన చేశారు. భారతీయ సినీ పితామహుడిగా పేరు పొందిన దాదా సాహెబ్ ఫాల్కే పేరు మీద సినిమా తీస్తున్నట్లు వెల్లడించాడు. ఆయన చేసిన తాజా ప్రకటన బాలీవుడ్ ను, ఇండియన్ సినీ ఇండస్ట్రీని షేక్ చేసింది. దీనికి ప్రధాన కారణం ఏమిటంటే ఇదే దాదా సాహెబ్ ఫాల్కే పేరుతో రాజ్ కుమార్ హిరాణీ కూడా ప్రముఖ టాప్ హీరో అమీర్ ఖాన్ తో తీస్తున్నట్లు ప్రకటించాడు. దీంతో ఇద్దరు దర్శకులు పేరు పొందిన వారు కావడం, ఇకే వ్యక్తిపై బయోపిక్ తీయడం ఒకింత చర్చకు దారి తీసేలా చేసింది.
ఏ పాత్రకైనా న్యాయం చేసే సత్తా కలిగిన నటుడు జూనియర్ ఎన్టీఆర్. తను ప్రస్తుతం కేజీఎఫ్, సలార్ సినిమాల ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్న డ్రాగన్ లో నటిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ శఱ వేగంగా కొనసాగుతోంది. ఇక గతంలో జక్కన్న దర్శకత్వంలో తారక్ నటించాడు. ఆర్ఆర్ఆర్ మూవీ ఏకంగా ఆస్కార్ అవార్డును స్వంతం చేసుకుంది.
ఇదే సమయంలో తను నటించిన కొరటాల శివ దర్శకత్వం వహించిన దేవర సూపర్ హిట్ అయ్యింది. దీనికి సీక్వెల్ గా రాబోతోంది. ఇందులో సేమ్ జాన్వీ కపూర్ కీ రోల్ పోషించనుంది. తనతో పాటు సైఫ్ అలీ ఖాన్ కూడా కీ రోల్ పోషించాడు. మేడిన్ ఇండియాలో భాగంగా దాదా సాహెబ్ ఫాల్కే జీవితాన్ని సినిమాగా తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నట్లు తెలిపాడు జక్కన్న. సో అటు రాజ్ కుమార్ హిరాణీ ఇటు రాజమౌళి మధ్య పోటీ నెలకొంది. ఎవరి చిత్రం ఎలా ఉండబోతోందో విడుదలైతే కానీ చెప్పలేం.