చెరిగి పోని బంధం 50 ఏళ్ల అనుబంధం

ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసిన క‌మ‌ల్ హాస‌న్

మా ఇద్ద‌రి మ‌ధ్య బంధం ఈనాటిది కాదు. దాదాపు 50 ఏళ్ల‌కు పైగా అవుతోంది తామిద్ద‌రం క‌లుసుకుని. ఇప్ప‌టికీ తొలుత ఎలా ప‌ల‌క‌రించుకున్నామో ఇప్పుడు కూడా అలాగే మాట్లాడుకుంటూ, చ‌ర్చించుకుంటూ ఉంటామ‌ని ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశాడు ఇల‌య నాయ‌గ‌న్ (లోక నాయ‌కుడు) క‌మ‌ల్ హాస‌న్ ద‌ర్శ‌కుడు మ‌ణిర‌త్నం గురించి. త‌న ద‌ర్శ‌క‌త్వంలో 30 ఏళ్ల కింద‌ట నాయ‌కుడు సినిమాలో న‌టించాన‌ని, అది భార‌తీయ సినిమా చ‌రిత్ర‌లో ఒక మైలురాయిగా నిలిచి పోయింద‌న్నాడు. తాజాగా త‌న ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన థ‌గ్ లైఫ్ లో కీల‌క పాత్ర పోషించాడు క‌మ‌ల్ హాస‌న్.

ఆయ‌న‌తో పాటు అందాల ముద్దుగుమ్మ త్రిష కృష్ణ‌న్ తో పాటు స్టార్ హీరో సిలాంబ‌ర‌స‌న్ కూడా కీ రోల్స్ పోషించారు. త్రిష‌తో పాటు అభిరామి కూడా మెస్మ‌రైజ్ చేసేందుకు రెడీ అయ్యింది. ఈ సినిమా ప్ర‌మోష‌న్స్ కొన‌సాగుతున్నాయి. ఇటీవ‌లే చెన్నే వేదిక‌గా థ‌గ్ లైఫ్ ఆడియో కూడా లాంచ్ అయ్యింది. సిలాంబ‌ర‌స‌న్ మాట్లాడుతూ క‌మ‌ల్ హాస‌న్ పై ప్ర‌శంస‌లు కురిపించాడు. అయితే మ‌ణిర‌త్నం, ఏఆర్ రెహ‌మాన్ ను మ‌రిచి పోలేన‌ని, వారికి రుణ‌ప‌డి ఉంటాన‌ని చెప్పాడు.

త‌ను క‌ష్ట కాలంలో ఉన్న స‌మ‌యంలో త‌న‌కు లైఫ్ ఇచ్చారు ఆ ఇద్ద‌రంటూ పేర్కొన్నాడు. విచిత్రం ఏమిటంటే ఈ సినిమాకు క‌థ రాశాడు క‌మ‌ల్ హాస‌న్. ఇందులో ఒక పాట‌కు త‌నే సాహిత్యం అందించాడు. ఈ చిత్రానికి ఏఆర్ రెహ‌మాన్ మ్యూజిక్ ఇచ్చాడు. 38 ఏళ్ల గ్యాప్ మ‌ణిర‌త్నంతో ఎందుకు వ‌చ్చింద‌న్న ప్ర‌శ్న‌కు స‌మాధానం ఇచ్చాడు క‌మ‌ల్ హాస‌న్. గ‌త 50 ఏళ్లుగా క‌లిసి ప‌ని చేస్తూనే ఉన్నాం. సినిమాలు చేయ‌క పోయినా మా క‌ల‌ల చిత్రాల‌ను నిర్మిస్తున్నామ‌ని చెప్పాడు ఇల‌య నాయ‌గ‌న్.

Leave A Reply

Your email address will not be published.

Social Media Auto Publish Powered By : XYZScripts.com