కుబేర ట్రైల‌ర్ 20కి వాయిదా

చావు క‌బురు చల్ల‌గా చెప్పారు

ప్ర‌క‌టించిన తేదీలు మారి పోతున్నాయి. ఒక్కోసారి అనుకోకుండా ఫ్యాన్స్ ను హ‌ర్ట్ చేసేలా ఉంటున్నాయి. ఒక దానితో మ‌రొక‌టి క్లాష్ కాకుండా ఉండేందుకు ఇలా మార్చాల్సి వ‌స్తోందంటున్నారు , స‌ర్ది చెప్పే ప్ర‌య‌త్నం చేస్తున్నారు మూవీ మేక‌ర్స్. తాజాగా ఇలాంటిదే ఒక‌టి శేఖ‌ర్ క‌మ్ముల విష‌యంలో చోటు చేసుకుంది. తాను తీసిన కుబేర‌ ట్రైల‌ర్ ను ఇవాళ రిలీజ్ చేద్దామ‌ని అనుకున్నారు. దీంతో మంచు మోహ‌న్ బాబు నిర్మించిన క‌న్న‌ప్ప కూడా ఇదే రోజు ఈవెంట్ ఉండ‌డంతో చావు క‌బురు చల్ల‌గా చెప్పారు.

కుబేర మూవీ ట్రైల‌ర్ ను జూన్ 20న విడుద‌ల చేస్తామ‌ని ప్ర‌క‌టించారు. సోష‌ల్ మీడియా వేదిక‌గా ఈ విష‌యాన్ని అధికారికంగా వెల్ల‌డించారు. ఈ సినిమాలో అక్కినేని నాగార్జున‌, కోలీవుడ్ స్టార్ హీరో ధ‌నుష్ కీల‌క పాత్ర పోషించారు. వీరితో నేష‌న‌ల్ క్ర‌ష్ ర‌ష్మిక మంద‌న్నా కూడా కీ రోల్ పోషించింది. దీంతో చిత్రంపై భారీ అంచ‌నాలు పెరిగాయి. మార్కెట్ ప‌రంగా మంచి డిమాండ్ ఏర్ప‌డింది. మ‌రో ముఖ్య‌మైన పాత్ర‌లో జిమ్ శ‌ర‌భ్ న‌టించారు.

ఇదిలా ఉండ‌గా ఇప్ప‌టి వ‌ర‌కు చిన్న స్టార్స్ తో సినిమాలు తీస్తూ వ‌చ్చాడు శేఖ‌ర్ క‌మ్ముల. త‌న సినీ కెరీర్ లో తొలిసారిగా భారీ స్టార్స్ తో కుబేర తీయ‌డం. కాన్సెప్ట్ బాగా ఉండ‌డం, సంగీతానికి ఎక్కువ ప్రాధాన్య‌త ఇవ్వ‌డంతో కుబేర త‌ప్ప‌కుండా హిట్ అవుతుంద‌ని సినీ వ‌ర్గాలు పేర్కొంటున్నాయి. త‌ను అనుకున్న‌ది సాధించేంత వ‌ర‌కు నిద్ర పోడు ద‌ర్శ‌కుడన్న పేరు కూడా ఉంది. దీంతో సినిమాపై హై ఎక్సెపెక్టేష‌న్స్ ఉండ‌డం స‌హ‌జ‌మే క‌దూ.

Leave A Reply

Your email address will not be published.

Social Media Auto Publish Powered By : XYZScripts.com