తొక్కిస‌లాట ఘ‌ట‌న‌..రాజ్ భ‌వ‌న్ స్పంద‌న

గ‌వ‌ర్న‌ర్ ను స్వ‌యంగా సీఎం ఆహ్వానించారు

బెంగ‌ళూరు – ఐపీఎల్ క‌ప్ గెలుచుకున్న అనంత‌రం ఆర్సీబీ విజ‌యోత్స‌వ స‌భ నిర్వహించేందుకు క‌ర్ణాట‌క కాంగ్రెస్ స‌ర్కార్ ప్లాన్ చేసిందంటూ బాంబు పేల్చింది కర్ణాట‌క రాష్ట్ర రాజ్ భ‌వ‌న్. ఈ మేర‌కు మంగ‌ళ‌వారం కీలక ప్ర‌క‌ట‌న చేసింది. ఇందులో త‌మ ప్రేమ‌యం ఏమీ లేదంటూ పేర్కొంది. ఇందుకు సంబంధించి పూర్తి వివ‌ర‌ణ ఇచ్చే ప్ర‌య్నం చేశారు రాజ్ భ‌వ‌న్ కార్యాల‌యం సిబ్బంది.

తొక్కిసలాట ఘటనకు త‌మ‌కు ఏ మాత్రం సంబంధం లేదంటూ పేర్కొంది.. RCB విక్టరీ పరేడ్ ప్రణాళిక కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వానిదే అని తేల్చి చెప్పింది. మొదట RCB ఆటగాళ్లను రాజ్‌భవన్‌లో సన్మానించాలనేది గవర్నర్ నిర్ణయమేనని స్పష్టం చేసింది. విధాన సౌధలోనే సన్మాన సభ జరుగుతుందని, గవర్నర్‌ను స్వయంగా రావాలంటూ సీఎం ఆహ్వానించారని వెల్ల‌డించింది.

ఇదిలా ఉండ‌గా ఆర్సీబీ విజ‌యోత్సం తీవ్ర విషాదాన్ని నింపేలా చేసింది. చిన్న స్వామి స్టేడియంలో స‌న్మాన స‌భ ఏర్పాటు చేశారు. ఇందులో కేవ‌లం 35 వేల మంది మాత్ర‌మే ప‌డతారు. కానీ బ‌య‌ట ఎవ‌రూ ఊహించ‌ని రీతిలో ఏకంగా 3 ల‌క్ష‌ల మంది అభిమానులు హాజ‌ర‌య్యారు. లా అండ్ ఆర్డ‌ర్ కంట్రోల్ త‌ప్పారు. ఈ ఘ‌ట‌న‌పై హైకోర్టు సీరియ‌స్ అయ్యింది. 11 మంది ప్రాణాలు కోల్పోగా 33 మందికి పైగా తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. దీనిపై విచార‌ణ‌కు ఆదేశించారు సీఎం సిద్ద‌రామ‌య్య‌.

రిటైర్డ్ జ‌డ్జితో విచార‌ణ క‌మిష‌న్ ఏర్పాటు చేశారు. పూర్తి నివేదిక ఇవ్వాల‌ని ఆదేశించారు. ఈ మొత్తం ఘ‌ట‌న‌కు కాంగ్రెస్ స‌ర్కార్ దే బాధ్య‌త అని వెంట‌నే బాధ్య‌త వ‌హిస్తూ సీఎం సిద్ద‌రామ‌య్య‌, డిప్యూటీ సీఎం డీకే శివ‌కుమార్, హోం మంత్రి జి. ఈశ్వ‌రయ్య ప‌ద‌వుల‌కు రాజీనామా చేయాల‌ని బీజేపీ డిమాండ్ చేసింది.

Leave A Reply

Your email address will not be published.

Social Media Auto Publish Powered By : XYZScripts.com