ప్రస్తుతం విడుదలవుతున్న కమర్షియల్ సినిమాలలో ఐటం సాంగ్ లకు ఎక్కువగా ప్రయారిటీ ఉంటోంది. సుకుమార్ దర్శకత్వం వహించిన పుష్ప మూవీలో ఊ అంటావా అనే సాంగ్ లో ప్రత్యేకించి సమంత నటించింది. ఇది ఆ మూవీకి హైలెట్ గా నిలిచింది. ఇదే ఫార్ములాను ఫాలో అవుతున్నారు ఇతర దర్శకులు.
తాజాగా అందాలు ఆరబోసే హీరోయిన్లకు ప్రయారిటీ ఇస్తున్నారు. ఇందులో భాగంగా తన అందం, బోల్డ్ ప్రదర్శనలతో యువతను పిచ్చెక్కిస్తున్న నటి కావ్యా థాపర్ కు అరుదైన ఛాన్స్ దక్కించుకుంది. ప్రస్తుతం తన గ్లామర్ తో ఆకట్టుకుంటోంది.
రైజింగ్ స్టార్ గా పేరు పొందిన రామ్ పోతినేనితో డైనమిక్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తీస్తున్న డబుల్ స్మార్ట్ లో నటించేందుకు ఎంపికైంది కావ్యా థాపర్ . ఇందులో రామ్ తో కావ్య ఒక పాటలో నటించనుంది. ఈ మేరకు సంతకం చేసింది కూడా.
ఈ సినిమాకు సంబంధించి ఈ సాంగ్ హైలెట్ గా ఉంటుందని టాలీవుడ్ లో టాక్. ఇది హైలెట్ అవుతుందని అంటున్నారు. ఇక తాజాగా శ్రీను వైట్ల దర్శకత్వం వహిస్తున్న గోపీచంద్ మూవీలో రెండో హీరోయిన్ గా కావ్య థాపర్ ఎంపికైంది. సో తన లక్కీని పరీక్షించు కునేందుకు రెడీ అయ్యింది లవ్లీ గర్ల్.