పెళ్లి చూపులు, ఈ నగరానికి ఏమైంది అంటూ జన రంజక సినిమాలు రూపొందించిన దర్శకుడు తరుణ్ భాస్కర్ నుంచి తాజా చిత్రం కీడా కోలా. వినోదం, క్రైమ్ నేపథ్యంతో తెరకెక్కించే ప్రయత్నం చేశాడు. ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. మూవీలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారారు బ్రహ్మానందం. తరుణ్ భాస్కర్ , చైతన్య రావు , రాగ్ మయుర్ ప్రధాన పాత్రలలో నటించారు. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన పోస్టర్లు హల్ చల్ చేశాయి.
మూవీ మేకర్స్ గట్టి నమ్మకంతో ఉన్నారు. ప్రస్తుతం తెలుగు సినిమా రంగంలో ఈ మధ్యన కథతో పాటు వినోదానికి ప్రయారిటీ ఇస్తూ వస్తున్నారు దర్శక, నిర్మాతలు. క్రైమ్, కామెడీ తో నింపేశాడు. విచిత్రం ఏమిటంటే ప్రముఖ నటుడు దగ్గుబాటి రానా కీడా కోలా చిత్రాన్ని సమర్పిస్తుండడం విశేషం.
చిత్రాన్ని వచ్చే నెల నవంబర్ 3న విడుదల చేసేందుకు డిసైడ్ అయ్యారు. తేదీ దగ్గర పడుతుండడంతో మూవీ మేకర్స్ ప్రమోషన్స్ కూడా ప్రారంభించారు. ఇక పోస్టర్స్, టీజర్స్ కు విశేషమైన ఆదరణ లభించింది. దీంతో కీడా కోలా తప్పకుండా సక్సెస్ అవుతుందని భావిస్తున్నారు. వీజీ సైన్మా సంస్థ దీనిని నిర్మిస్తోంది.