తండ్రి అయిన కిర‌ణ్ అబ్బ‌వ‌రం

మ‌గ బిడ్డ‌కు జ‌న్మ‌నిచ్చిన రహ‌స్య‌ గోర‌క్

విల‌క్ష‌ణ న‌టుడిగా గుర్తింపు పొందిన కిర‌ణ్ అబ్బ‌వ‌రం తండ్రి అయ్యాడు. సామాజిక వేదిక‌గా ఈ విష‌యాన్ని పంచుకున్నారు పేరెంట్స్ అబ్బ‌వ‌రం, రహ‌స్య‌ గోర‌క్. వీరు మ‌గ బిడ్డ‌కు జ‌న్మ‌నిచ్చారు. ఈ ఇద్ద‌రూ గ‌త ఏడాది 2024 ఆగ‌స్టు 22న క‌ర్ణాట‌క లోకిన కూర్గ్ లోని ఓ రిసార్ట్ లో కొద్ది మంది కుటుంబీకులు, స్నేహితుల స‌మ‌క్షంలో పెళ్లి చేసుకున్నారు.

తెలుగు సినీ రంగంలో మంచి పేరు తెచ్చుకున్నాడు కిర‌ణ్ అబ్బ‌వ‌రం. త‌ను మొద‌ట‌గా ల‌ఘు చిత్రాల‌లో న‌టించాడు. త‌న కెరీర్ ను ప్రారంభించాడు. ఆ త‌ర‌వ్ఆత రాజా వారు రాణి గారు మూవీ 2019లో వ‌చ్చింది. ఇందులో ముఖ్య పాత్ర పోషించాడు. హీరోగా త‌న‌ను తాను ప్రూవ్ చేసుకున్నాడు. ఈ మూవీ క‌రోనా స‌మ‌యంలో వ‌చ్చింది. దీంతో ప్రేక్ష‌కులు భారీగా ఆద‌రించారు. బిగ్ స‌క్సెస్ చేశారు. దీంతో సినిమా బ్లాక్ బ‌స్ట‌ర్ గా నిలిచింది.

తొలి చిత్రంలో హీరోయిన్ గా న‌టించిన ర‌హ‌స్య గోర‌క్ తో ప‌రిచ‌యం ఏర్ప‌డింది. అది ప్రేమ‌గా మారింది. చివ‌ర‌కు ఇద్ద‌రు ఒక్క‌ట‌య్యేలా చేసింది. ఈ ఇద్ద‌రూ అన్యోన్యమైన దంప‌తులుగా పేరు పొందారు. గ‌త ఏడాది దీపావ‌ళి సంద‌ర్బంగా రిలీజ్ చేసిన క మూవీ సూప‌ర్ హిట్ గా నిలిచింది. ఇది విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు పొందింది. జాతీయ స్థాయిలో అవార్డును పొందింది. ఇందులో న‌ట‌న‌కు గాను కిర‌ణ్ అబ్బ‌వ‌రం కు మంచి గుర్తింపు ల‌భించింది.

Leave A Reply

Your email address will not be published.

Social Media Auto Publish Powered By : XYZScripts.com