రూ. 50 కోట్ల క్లబ్ లోకి ధ‌నుష్ మూవీ ఎంట‌ర్

పాజిటివ్ టాక్ తో దూసుకు పోతున్న కుబేర

శేఖ‌ర్ క‌మ్ముల తాజాగా తీసిన చిత్రం కుబేర‌. ప్రేక్ష‌కుల ముందుకు ఎలాంటి అంచ‌నాలు లేకుండానే వ‌చ్చేసింది. కానీ ఊహించ‌ని విధంగా పాజిటివ్ టాక్ తో దూసుకు పోతోంది. ఏకంగా రూ. 50 కోట్ల క్ల‌బ్ లోకి ఎంట‌ర్ అయ్యేందుకు రెడీగా ఉంది. ఈ సినిమాలో కోలీవుడ్ స్టార్ హీరో ధ‌నుష్ , టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున‌తో పాటు నేష‌న‌ల్ క్ర‌ష్ ర‌ష్మిక మంద‌న్నా కీ రోల్స్ పోషించారు. ఇక తొలిసారిగా శేఖ‌ర్ క‌మ్ముల చిత్రానికి సంగీతం అందించాడు రాక్ స్టార్ మ్యూజిక్ డైరెక్ట‌ర్ దేవిశ్రీ ప్ర‌సాద్. ఆసియ‌న్ సునీల్ దీనిని నిర్మించాడు. సినిమా స‌క్సెస్ మీట్ కూడా ఇటీవ‌లే జ‌రిగింది. దీనికి మెగాస్టార్ చిరంజీవి హాజ‌ర‌య్యాడు.

ఈ సంద‌ర్బంగా సినిమా స‌క్సెస్ ప‌ట్ల ఆనందం వ్య‌క్తం చేశాడు. తొలుత శేఖ‌ర్ క‌మ్ముల క‌థ‌తో త‌న వ‌ద్ద‌కు వ‌చ్చాడ‌ని, కానీ తాను న్యాయం చేయ‌లేనంటూ కింగ్ నాగార్జున‌ను ప్రిఫ‌ర్ చేశాన‌ని చెప్పాడు. ఇక ర‌ష్మిక మంద‌న్నా గురించి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశాడు. త‌న క‌ళ్లు అద్భుతంగా ఉన్నాయంటూ కితాబు ఇచ్చాడు.
ఇదే స‌మ‌యంలో హీరో ధ‌నుష్ న‌ట‌న గురించి ఎంత చెప్పినా త‌క్కువేన‌ని అన్నాడు. తాను సినిమా చూశాన‌ని, త‌న‌ను గుర్తు ప‌ట్ట‌లేక పోయాన‌ని ధ‌నుష్ గురించి తెలిపాడు. ఇక కింగ్ న‌ట‌న సూప‌ర్ అంటూ పేర్కొన్నాడు.

ధ‌నుష్ విడుద‌లైన తొలి షో నుంచే సూప‌ర్ క‌లెక్ష‌న్స్ తో దుమ్ము రేపుతోంది. జూన్ 20న ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. మొద‌ట‌గా శుక్ర‌వారం రోజు రూ. 14.75 కోట్ల‌తో ప్రారంభించింది. 21న శ‌నివారం రూ. 16.5 కోట్లు వ‌సూలు చేసింది. ఆదివారం సెల‌వు రోజు కావ‌డంతో ఆ సంఖ్య పెరిగింది. రూ. 17.25 కోట్లు రాబ‌ట్టింది. మూడు రోజుల‌లో వ‌సూళ్లు దాదాపు రూ. 48.50 కోట్ల‌కు చేరుకున్నాయి. ఇవాళ గ‌నుక దాటితే రూ. 50 కోట్ల క్ల‌బ్ లోకి చేర‌డం ఖాయంగా క‌నిపిస్తోంది. మొత్తంగా శేఖ‌ర్ క‌మ్ముల ద‌ర్శ‌క‌త్వం, క‌థ అందించిన పింగ‌ళి చైత‌న్య‌కు థ్యాంక్స్ చెప్పాలి.

Leave A Reply

Your email address will not be published.

Social Media Auto Publish Powered By : XYZScripts.com