ఫ్యాన్స్ కు షాక్ కుబేర టికెట్ల ధ‌ర‌లు జంప్

ధ‌రలు పెంచుతూ ఏపీ స‌ర్కార్ జీవో జారీ

అమ‌రావ‌తి – ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం కోలుకోలేని షాక్ ఇచ్చింది సినీ అభిమానుల‌కు. ముఖ్యంగా కింగ్ అక్కినేని నాగార్జున‌, కోలీవుడ్ సూప‌ర్ హీరో ధ‌నుష్, నేష‌న‌ల్ క్ర‌ష్ ర‌ష్మిక మంద‌న్నా క‌లిసి న‌టించిన చిత్రం కుబేర ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ మేర‌కు మూవీ మేక‌ర్స్ అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. జూన్ 20న శుక్ర‌వారం ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌ల చేయ‌నున్నారు. ఇప్ప‌టికే మూవీకి సంబంధించి పెద్ద ఎత్తున ప్రచారం చేప‌ట్టారు. టీజ‌ర్, పోస్ట‌ర్స్, ట్రైల‌ర్, సాంగ్స్ కు పెద్ద ఎత్తున స్పంద‌న వ‌చ్చింది. దీనిని విల‌క్ష‌ణ‌, సృజ‌నాత్మ‌క‌త క‌లిగిన ద‌ర్శ‌కుడు శేఖ‌ర్ క‌మ్ముల తీశాడు.

త‌న సినీ కెరీర్ లో తొలిసారి ఆయ‌న బిగ్ స్టార్స్ తో మూవీ తీయ‌డంతో. దీంతో సినిమాపై బ‌జ్ పెరిగింది. భారీ ఎత్తున ముంద‌స్తు టికెట్ల కోసం పోటీ ఏర్ప‌డింది. సినిమాను చూడాల‌ని అనుకునే అభిమానుల‌కు కోలుకోలేని షాక్ త‌గిలింది. ఏపీ ప్ర‌భుత్వం కుబేర సినిమా టికెట్ల ధ‌ర‌ల‌ను పెంచుతూ ఉత్త‌ర్వులు జారీ చేసింది. తాజాగా ప్రభుత్వం జారీ చేసిన జీవో సినీ ప్రియులను దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ మేర‌కు చిత్ర నిర్మాతలను అనుమతించింది.

GO ప్రకారం సింగిల్ స్క్రీన్లలో టిక్కెట్ల ధరలు రూ. 236 వరకు పెంచబడ్డాయి, మల్టీప్లెక్స్ టిక్కెట్లు రూ. 265.50 వరకు ఉండవచ్చు. ఈ చర్య సినిమా ప్రేమికులకు, కుటుంబాలకు, ముఖ్యంగా సినిమా ప్రజాదరణ దృష్ట్యా, సాధారణ సినిమా ప్రదర్శన కోసం ఆశిస్తున్న వారికి ఝ‌ల‌క్ ఇచ్చింది.

ధరల పెరుగుదల సినిమా ప్రేక్షకులు, వాణిజ్య వర్గాలలో చర్చకు దారితీసింది, కొందరు దీనిని థియేటర్ ఆదాయాలకు ప్రోత్సాహకంగా స్వాగతించ‌గా మరికొందరు దీనిని ప్రేక్షకులపై అదనపు భారంగా పేర్కొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Social Media Auto Publish Powered By : XYZScripts.com