తన అందంతోనే కాదు నటనతో కూడా ఆకట్టుకుంది ముద్దుగుమ్మ అనుష్క శెట్టి. తమిళం, కన్నడ, తెలుగు చిత్రాలలో ఇరగదీసింది. తనను పూరీ జగన్నాథ్ సినీ రంగానికి పరిచయం చేశాడు. అక్కినేని నాగార్జున సూపర్ మూవీతో. ఆ తర్వాత వెనక్కి తీసుకోలేదు. స్టార్ హీరోల సరసన నటించింది. మెప్పించింది. తను పాన్ ఇండియా హీరోయిన్ గా మారి పోయింది. దీనికి కారకుడు దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి. తను ప్రభాస్ తో తీసిన బాహు బలి రికార్డుల మోత మోగించింది. ఇండియన్ సినీ చరిత్రలో అది ఓ రికార్డ్ . ఆ తర్వాత సీక్వెల్ లో కూడా నటించింది. ఇదే సమయంలో ప్రభాస్ తో కొరటాల శివ తీసిన మిర్చిలో కూడా సూపర్ గా నటించింది.
అంతకు ముందు మాస్ మహారాజాతో జక్కన్న తీసిన విక్రమార్కుడులో తళుక్కుమంది. ఇది కూడా బిగ్ హిట్ . ఇది పక్కన పెడితే కొంత కాలంగా సినిమాలకు దూరంగా ఉంది. ఆ గ్యాప్ లేకుండా ప్రయత్నం చేస్తానంటూ ఈ మధ్యనే చిట్ చాట్ సందర్బంగా చెప్పింది. ఇది పక్కన పెడితే తనకు బంపర్ ఆఫర్ కోలీవుడ్ నుంచి వచ్చినట్లు సమాచారం. పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఆ దర్శకుడు ఎవరో కాదు. ప్రస్తుతం రజనీకాంత్ తో కూలీ మూవీ తీస్తున్న దర్శకుడు లోకేష్ కనగరాజ్.
తను గతంలో తీసిన ఖైదీ సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇప్పుడు తను ఖైదీని సీక్వెల్ గా తీసేందుకు రెడీ అయ్యాడని, ఈ మేరకు కీ రోల్ కోసం అనుష్క శెట్టిని సంప్రదించారని, అయితే తాను ఇంకా ఏమీ చెప్పలేదని టాక్. ఇక దర్శకుడు లోకేష్ కనగరాజ్ గురించి చెప్పాలంటే తన మూవీస్ లో హీరోలకే ప్రయారిటీ ఉంటుంది. హీరోయిన్స్ గురించి అంతగా పట్టించు కోడన్న అపవాదు ఉంది. కానీ టేకింగ్, మేకింగ్ వరకు వచ్చేసరికల్లా తను సూపర్ అని చెప్పక తప్పదు.