బాలీవుడ్ లో ప్రస్తుతం ఖాన్ ల త్రయం ఆధిపత్యం తగ్గిపోతోందా. ఒక్క షారుక్ ఖాన్ మాత్రమే ఇప్పటి వరకు గట్టెక్కాడు. తను నమ్ముకున్న తమిళ సినీ దర్శకుడు అట్లీ కుమార్ ఒక రకంగా గట్టెక్కించాడని చెప్పక తప్పదు. తనతో తీసిన జవాన్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఇందులో ప్రతి నాయకుడి పాత్రకు మంచి మార్కులు పడ్డాయి. ఆ పాత్రకు జీవం పోశాడు విలక్షణ నటుడిగా గుర్తింపు పొందిన విజయ్ సేతుపతి. తనను ఉద్దేశించి బాద్ షా ఏకంగా సర్ అని సంబోదించడం ఆసక్తిని రేపింది. ఇక తను ఏస్ మూవీతో ముందుకు వచ్చాడు.
ఇది పక్కన పెడితే మరో అగ్ర నటుడు అమీర్ ఖాన్ గురించి కీలక అప్ డేట్ వచ్చింది. తను ప్రస్తుతం తారే జమీన్ పర్ మూవీ రీ రిలీజ్ చేసే పనిలో ఉన్నాడు. మరో వైపు తమిళ సినీ సూపర్ స్టార్ రజనీకాంత్ తో కలిసి కూలీ సినిమాలో అతిథి పాత్ర పోషించాడు. దీనిని ప్రతిష్టాత్మకంగా చిత్రీకరించాడు యంగ్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్. తను దళపతితో తీసిన మాస్టర్ సూపర్ హిట్. ఈ చిత్రంలో నాగార్జునతో పాటు అమీర్ ఖాన్ నటించాడు.
ఒకప్పుడు బాలీవుడ్ సినిమాలు, నటీ నటులు టాప్ లో ఉండేవారు. ముఖ్యంగా అమీర్ ఖాన్, సల్మాన్ ఖాన్ , షారుక్ ఖాన్ లు కొంత కాలం పాటు రాజ్యం ఏలారు. కానీ ఇప్పుడు వారి ఆధిపత్యానికి గండి కొట్టింది సౌత్ ఇండియా. ఇక్కడి దర్శకుల టాలెంట్ కు జనం ఫిదా అవుతున్నారు. కేజీఎఫ్ తో ప్రశాంత్ నీల్ , బాహుబలి, ఆర్ఆర్ఆర్ తో రాజమౌలి, తంగలాన్ తో పా రంజిత్..అట్లీ కుమార్..ఇలా చెప్పుకుంటూ పోతే చాలా దర్శకులు ఉన్నారు.
షూటింగ్ సందర్బంగా లోకేష్ కనగరాజ్ కథ వినిపించాడని, దానికి అమీర్ ఖాన్ ఫుల్ ఫిదా అయ్యాడని టాక్. కూలీ పూర్తయ్యాక కార్తీతో ఓ మూవీ చేయనున్నాడు దర్శకుడు. దాని తర్వాత అమీర్ తో ఉండనుందని సమాచారం.