ప్రముఖ టాలీవుడ్ నటుడు మహేష్ బాబు ఘట్టమనేని ఆకస్తికర వ్యాఖ్యలు చేశాడు. ఆకాశంలో నక్షత్రాలు వెలుగుతున్నట్లే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆటగాళ్లు ఎల్లప్పటికీ వెలుగుతూనే ఉంటారని పేర్కొన్నారు. అహ్మదాబాద్ వేదికగా జరిగిన ఐపీఎల్ 2025 ఫైనల్ మ్యాచ్ లో రజత్ పాటిదార్ నాయకత్వంలోని ఆ జట్టు చిరస్మరణీయమైన గెలుపు సాధించింది. ఇది ఎవరూ , ఏ జట్టు ఊహించ లేదు. పంజాబ్ కింగ్స్ ఎలెవన్ చివరి బంతి వరకు పోరాడింది. చేసిన పోరాటం ఫలించ లేదు. చివరకు కేవలం 6 పరుగుల స్వల్ప తేడాతో ఓటమి పాలైంది.
ఇక్కడ ప్రధానంగా చెప్పుకోవాల్సింది ఒకే ఒక్కడు పంజాబ్ స్కిప్పర్ శ్రేయాస్ అయ్యర్. ఆ జట్టును విజయ తీరాల వరకు తీసుకు రావడంలో కీలక పాత్ర పోషించాడు. ఇందులో ఎలాంటి అనుమానం అక్కర్లేదు. టోర్నీలో భాగంగా క్వాలిఫయర్ -1లో ఓటమి పాలైన జట్టును క్వాలిఫయర్ -2లో ముంబై ఇండియన్స్ కు ఝలక్ ఇచ్చాడు అయ్యర్.
ఈ సందర్బంగా ఐపీఎల్ గెలుపుపై సినీ, రాజకీయ, వ్యాపార ,వాణిజ్య, తదితర రంగాలకు చెందిన ప్రముఖులు స్పందించారు. ఆర్సీబీ సాధించిన అపూర్వమైన విజయం గురించి ప్రస్తావించారు. ఆ జట్టు కప్ గెలిచేందుకు 18 ఏళ్ల పాటు నిరీక్షించడం మామూలు విషయం కాదని పేర్కొన్నాడు ప్రిన్స్ మహేష్ బాబు. ఆ జట్టు ప్రదర్శించిన ప్రతిభ గురించి ఎంత చెప్పినా తక్కువేనని తెలిపాడు. ఎన్నడూ, ఎక్కడా ఓటమిని ఒప్పుకోని విరాట్ కోహ్లీని చూసి నేర్చుకోవాల్సింది చాలా ఉందన్నాడు.