టాలీవుడ్ లో టాప్ హీరోగా పేరు పొందారు ప్రిన్స్ మహేష్ బాబు. తనకు భారీ ఎత్తున ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. తాజాగా ఓ కొత్త ట్రెండ్ కొనసాగుతోంది తెలుగు చలన చిత్ర పరిశ్రమలో. గతంలో టాప్ హీరో హీరోయిన్లు నటించిన బ్లాక్ బస్టర్ గా నిలిచిన సినిమాలను తిరిగి విడుదల చేస్తున్నారు. మరికొన్నింటిని ఓటీటీల్లో స్ట్రీమింగ్ చేస్తున్నారు. ఇందులో భాగంగా మహేష్ బాబు సినీ కెరీర్ లో సక్సెస్ పొందిన చిత్రాలలో ఒకటైన ఖలేజాను విడుదల చేసేందుకు రెడీ అయ్యారు మూవీ మేకర్స్. ఈ మేరకు ఇప్పటికే దీనికి సంబంధించి అధికారికంగా ప్రకటించారు కూడా.
ప్రస్తుతం తను బిజీగా ఉన్నాడు. దాదాపు 2 సంవత్సరాల వరకు దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళితో ప్యాకప్ అయ్యాడు. ఎస్ఎస్ఎంబీ29 షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. దీనిని జక్కన్న హాలీవుడ్ రేంజ్ లో తీస్తున్నాడు. దీంతో తన సినిమా పూర్తయ్యేంత వరకు ఏ సినిమా చేసేందుకు వీలు లేకుండా పోయింది. దీనిని గమనించిన మహేష్ బాబు టీం ఉన్నట్టుండి సంచలన నిర్ణయం తీసుకున్నారు. అభిమానుల కోరిక మేరకు తిరిగి తను నటించిన సక్సెస్ ఫుల్ మూవీస్ ను తిరిగి విడుదల చేయాలని కోరడంతో ఖలేజా రానుంది.
ఇక ఖలేజాకు ముందు మహేష్ బాబు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో నటించాడు. అదే సినీ ఇండస్ట్రీని షేక్ చేసిన చిత్రం అతడు. ఇది బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ప్రిన్స్ సినీ కెరీర్ లో మరిచి పోలేని మూవీగా నిలిచి పోయింది. మే 30న రీ రిలీజ్ కానుందని ప్రకటించడంతో ఫ్యాన్స్ లలో మరింత ఉత్కంఠ నెలకొంది.
సినిమాకు సంబంధించి ప్రీ సేల్స్ కొనసాగుతున్నాయి. ఇప్పటి దాకా ఖలేజా బాక్సాఫీస్ వద్ద రూ. 3 కోట్లకు పైగా వసూలు చేసింది.