ఢిల్లీ – ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆయన ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఉద్దేశించి మండిపడ్డారు. తన వల్ల దేశానికి ఒరిగింది ఏమిటో చెప్పాలని నిలదీశారు. 11 ఏళ్లలో ప్రధాని 151 సార్లు విదేశీ పర్యటనలు చేశారని , దీని వల్ల ఏం సాధించారో తనకే తెలియాలన్నారు. తన వ్యక్తిగత ప్రచారంపై ఉన్నంత శ్రద్ద ఈ దేశంపై , ప్రజలపై లేదని ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం మల్లికార్జున్ ఖర్గే మీడియాతో మాట్లాడారు. పలు ప్రశ్నలు సంధించారు మోదీకి.
ఆపరేషన్ సిందూర్ కు తామంతా సహకరించామని, కానీ ఎందుకు దాడి చేశారో ఎందుకు అర్ధాంతరంగా ముగించారో తెలియదన్నారు. ఈ విషయం గురించి చెప్పాల్సిన బాధ్యత ప్రధానిపై ఉందన్నారు మల్లికార్జున్ ఖర్గే. మోదీ విదేశాంగ విధానం దేశానికి శాపంగా మారిందని ఆవేదన చెందారు. ఆయన తరచుగా ఎందుకు విదేశాలు పర్యటిస్తున్నారంటూ నిలదీశారు. దీని వల్ల ప్రజా ధనానికి బొక్క తప్ప ఒరిగింది ఏముందంటూ ఫైర్ అయ్యారు.
దౌత్య పరంగా ఎలాంటి విజయాలు సాధించారనేది విదేశాంగ శాఖ నిర్వహిస్తున్న జై శంకర్ చెప్పాలన్నారు. కేవలం ఫోటోలు మాత్రమే దర్శనం ఇస్తున్నాయని, దీని ద్వారా ఎలాంటి ప్రయోజనాలు దేశానికి కలిగియానేది ఇప్పటి దాకా చెప్పలేక పోయారంటూ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.