నటుడు మంచు మనోజ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు తన తండ్రి మంచు మోహన్ బాబు గురించి. ఈ మధ్యన మంచు ఫ్యామిలీలో చోటు చేసుకున్న విభేదాలు రచ్చకెక్కాయి. ఒకరిపై మరొకరు ఆరోపణలు చేసుకోవడం, ఫిర్యాదులు చేసుకునేంత దాకా వెళ్లింది. అంతే కాదు వీరిపై కేసులు కూడా నమోదయ్యాయి. మీడియాపై గన్ కూడా ఎక్కు పెట్టాడు మోహన్ బాబు. ఆయనపై అరెస్ట్ వారెంట్ కూడా జరీ చేసింది తెలంగాణ హైకోర్టు.
ఈ విషయంపై స్ట్రాంగ్ వార్నింగ్ కూడా ఇచ్చారు సిటీ పోలీస్ కమిషనర్. తమ కుటుంబంలో నెలకొన్న లుకలుకలు బయట పడ్డాయి వీరి నిర్వాకం కారణంగా. నిన్నటి దాకా నీతులు చెబుతూ వచ్చిన మంచు ఫ్యామిలీ తమ మధ్య ఉన్న విభేదాలను కంట్రోల్ చేసుకోలేక పోయారన్న అపవాదు మూటగట్టుకున్నారు. తిరుపతిలో విద్యా సంస్థలపై తీవ్ర వివాదాలు నెలకొన్నాయి. తండ్రీ కొడుకుల మధ్య మాటల యుద్దం కొనసాగింది. చివరకు కేసులు నమోదయ్యాయి.
ఈ సందర్బంగా మంచు మనోజ్ చిట్ చాట్ చేశాడు. కీలక వ్యాఖ్యలు చేశాడు. తను భైరవం కొత్త చిత్రంలో కీ రోల్ పోషించాడు. ఇదే సమయంలో తన తండ్రి మంచు మోహన్ బాబు గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తన తండ్రి రీల్ హీరో కాదని నిజ జీవితంలో గొప్ప తండ్రి అని పేర్కొన్నాడు. నీతి, నిజాయితీ అనేది మోహన్ బాబు నుంచి నేర్చుకున్నానని, దానికే తాను కట్టుబడి ఉన్నానని స్పష్టం చేశాడు మంచు మనోజ్.