భారతీయ సినీ దర్శకులలో తను అత్యుత్తమమైన డైరెక్టర్ మణిరత్నం. ఇక ఇలయ నాయగన్ గా గుర్తింపు పొందిన కమల్ హాసన్ , సిలాంబరసన్ , త్రిష కృష్ణన్ కలిసి నటించిన థగ్ లైఫ్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కానీ మణిరత్నం స్థాయిలో లేదన్న ప్రచారం జరిగింది. ప్రచారం పెద్ద ఎత్తున చేశారు. ఇదే సమయంలో చెన్నైలో జరిగిన ఓ ఈవెంట్ లో థగ్ లైఫ్ గురించి, ప్రత్యేకించి కన్నడ భాషపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు కమల్ హాసన్. తమిళంలోంచే కన్నడ పుట్టిందంటూ పేర్కొన్నాడు. దీనిపై కన్నడ నాట తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. కన్నడవాసులు కొందరు కోర్టును ఆశ్రయించారు.
దీనిపై సీరియస్ గా స్పందించింది కోర్టు. ఒక స్థాయిలో ఉన్న వాళ్లు ఇలాంటి కామెంట్స్ చేస్తే ఎలా అని ప్రశ్నించింది. వెంటనే క్షమాపణలు చెప్పాలని ఆదేశించింది. లేక పోతే తీవ్ర చర్యలు తప్పవంటూ హెచ్చరించింది. థగ్ లైఫ్ ను కర్ణాటక ఫిలిం ఛాంబర్ బ్యాన్ విధించింది ఎ క్కడా ఆడకుండా. దీంతో కమల్ హాసన్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కోర్టు ధర్మాసనం సంచలన తీర్పు వెలువరించింది. సినిమాపై విధించిన నిషేధాన్ని ఎత్తి వేయాలని, సినిమా రిలీజ్ చేసేలా చర్యలు తీసుకోవాలని సర్కార్ ను ఆదేశించింది.
ఇది పక్కన పెడితే 38 ఏళ్ల సుదీర్గ విరామం తర్వాత డైరెక్టర్ మణిరత్నం, నటుడు కమల్ హాసన్ కలిసి పని చేశారు. అప్పట్లో నాయకుడులో నటించారు. ఇదిలా ఉండగా థగ్ లైఫ్ కు కథను స్వయంగా రాశాడు ఇలయ నాయగన్. ఓ పాటకు కూడా ప్రాణం పోశాడు. ఈ సినిమాకు ఏఆర్ రెహమాన్ సంగీతం అందించాడు. మొత్తంగా బ్లాక్ బస్టర్ అవుతుందని అనుకున్న ఈ మూవీపై మిశ్రమ స్పందన లభించింది.