జ‌గ‌న్ పై భ‌గ్గుమ‌న్న అచ్చెన్న

ఉల్లిగ‌డ్డ‌కు ఆలుగ‌డ్డ‌కు తేడా తెలియ‌దు

అమ‌రావ‌తి – వ్య‌వ‌సాయ శాఖ మంత్రి కింజార‌పు అచ్చెన్నాయుడు నిప్పులు చెరిగారు. రైతుల‌కు ప్ర‌భుత్వానికి మ‌ధ్య చిచ్చు పెట్టేందుకు మాజీ సీఎం జ‌గ‌న్ రెడ్డి ప్ర‌య‌త్నం చేస్తున్నాడ‌ని సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. శుక్ర‌వారం ఆయ‌న మీడియాతో మాట్లాడారు. ఎండకు, వానకు, చలికి వెనకాడని రైతన్న రాజకీయ ప్రయోజనాల కోసం వైసీపీ నాయకులు చేస్తున్న కుట్రలకు భయపడుతున్నాడని అన్నారు. మద్యం కుంభకోణంలో తాడేపల్లి ప్యాలెస్ పెద్దలపై వస్తున్న ఆరోపణలను దారి మళ్లించేందుకు పంటలకు గిట్టుబాటు ధర లేదని, రాష్ట్రంలో శాంతిభద్రతలు లేవంటూ బెంగుళూరు ప్యాలెస్ నుంచి జగన్ రెడ్డి తప్పుడు ప్రచారం చేస్తున్నాడని ధ్వ‌జ‌మెత్తారు.

జాతీయంగా, అంతర్జాతీయంగా పొగాకు, మిర్చీ, కాకో ధరలు తగ్గినప్పటికి రైతులకు నష్టం జరగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నా జగన్ రెడ్డి ప‌దే ప‌దే నిరాధార ఆరోప‌ణ‌లు చేయ‌డం దారుణ‌మ‌న్నారు. HD బార్లీ పొగాకును క్వింటాలుకు కనీసం రూ.12,500 కు కొనుగోలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వ‌డం జ‌రిగింద‌న్నారు. పొగాకు రైతులకు అండగా నిలబడితే.. జగన్ రెడ్డి మాత్రం తప్పుడు ప్రచారం చేస్తున్నాడ‌ని ఆరొపించారు.

GPI & ITC సంస్థలు తక్షణమే 20 మిలియన్ కిలోలు కొనుగోలు ప్రారంభించిన విషయం బెంగుళూరు లో కూర్చుంటే జగన్ కు ఎలా కనిపిస్తుంద‌ని ప్ర‌శ్నించారు. పొగాకు రైతులకు అండగా డైలీ బేసిస్‌పై కొనుగోలు మానిటరింగ్‌కు కంట్రోల్ రూమ్ ను ఏర్పాటు చేయడమే కాకుండా ప్రత్యేక వాట్సాప్ గ్రూప్ ద్వారా సమీక్ష చేస్తూ.. పొగాకు రైతులకు తెలుగుదేశం ప్రభుత్వం అండగా ఉంటోందన్నారు తులకు లాభదాయకమైన ధర కల్పించాలన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Social Media Auto Publish Powered By : XYZScripts.com