హైదరాబాద్ – ఓరుగల్లు కాంగ్రెస్ పార్టీలో నువ్వా నేనా అన్న రీతిలో పోరు కొనసాగుతోంది. కేబినెట్ లో మంత్రిగా ఉన్న కొండా సురేఖ నిప్పులు చెరిగారు మాజీ మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్యే కడియం శ్రీహరిపై. తన నోటిని అదుపులో పెట్టుకోవాలని లేక పోతే బాగుండదంటూ సుతిమెత్తగా హెచ్చరించారు. తన కామెంట్స్ కు ఆమె స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేశారు. తాను మంత్రిగా ఉంటే నా ముందు కూర్చోవడానికి కడియం శ్రీహరి నామోషీగా ఫీల్ అవుతున్నాడంటూ ఎద్దేవా చేశారు.
అందుకే తనపై దుష్ప్రచారం చేయడం మొదలు పెట్టాడని, తన మంత్రి పదవి పోతుందంటూ తెగ ప్రచారం చేస్తున్నాడని ఇంకోసారి నోరు జారితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని వార్నింగ్ ఇచ్చారు కొండా సురేఖ. సీఎం దగ్గరకు, పొంగులేటి దగ్గరకు వెళ్లి నామీద ఉన్నది లేనిది చెప్తున్నాడని ఆరోపించారు. తెలుగుదేశం పార్టీలో నడిచినట్లు ఇక్కడ కూడా నడుస్తుందని కలలు కంటున్నాడని, కానీ ఆయనకు అంత సీన్ లేదన్నారు. బిడ్డా ఇక్కడ ఉన్నది కొండా అని అన్నారు.
నా అదృష్టం ఉంది కాబట్టే తాను మంత్రిని అయ్యానని, ఆయనకు లక్ ఉన్నప్పుడు మంత్రి కాలేదా అని ప్రశ్నించారు. నా కూతురుకు అదృష్టం దక్కలేదని, ఎమ్మెల్యే కాలేక పోయిందన్నారు. కడియం కూతురుకు లక్ ఉంది కాబట్టే ఎంపీ అయ్యిందన్నారు. అలా అని తన ఎంపీ పదవి పోవాలని తాను ఏమైనా ప్రచారం చేస్తున్నానా అని నిలదీశారు కొండా సురేఖ. ఇకనైనా తను ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని హితవు పలికారు.