జ‌గ‌న్ కామెంట్స్ నారా లోకేష్ సీరియ‌స్

నీలాగా అక్ర‌మాల‌కు పాల్ప‌డ లేద‌ని కామెంట్స్

గుంటూరు జిల్లా – విద్యా, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ నిప్పులు చెరిగారు. మాజీ సీఎం జ‌గ‌న్ రెడ్డిని ఉద్దేశించి సీరియ‌స్ కామెంట్స్ చేశారు. చిల్ల‌ర మ‌ల్ల‌ర వ్యాఖ్య‌లు చేయ‌డం మానుకోవాల‌ని హిత‌వు ప‌లికారు. ప్ర‌జ‌లు బుద్ది చెప్పినా త‌న తీరు మార్చుకోక పోవ‌డం దారుణ‌మ‌న్నారు. దేశంలో ఎక్క‌డా లేని విధంగా త‌మ ప్ర‌భుత్వం త‌ల్లికి వందనం ప‌థ‌కాన్ని అమ‌లు చేస్తోంద‌న్నారు. ఇప్ప‌టికే ఏ రాష్ట్రంలో ఇవ్వ‌ని విధంగా విద్యార్థులు ఉన్న త‌ల్లుల‌కు మొత్తం 17 ల‌క్ష‌ల మందికి నిధుల‌ను జ‌మ చేయ‌డం జ‌రిగింద‌న్నారు.

త‌న హ‌యాంలో రాష్ట్రాన్ని అప్పుల‌పాలు చేసినా , ఓ వైపు ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు ఉన్నా తాము ఇచ్చిన మాట ప్ర‌కారం నిధులు ఇచ్చామ‌న్నారు. ఆరుగురు పిల్ల‌ల‌కు కూడా జ‌మ చేశార‌ని, కొన్ని త‌న ఖాతాల్లోకి వ‌చ్చిన‌ట్లు నిరాధార‌మైన ఆరోప‌ణ‌లు చేయ‌డాన్ని తీవ్రంగా త‌ప్పు ప‌ట్టారు. ఇది జ‌గ‌న్ క‌డుపు మంట త‌ప్ప ఇంకోటి కాద‌న్నారు. చౌక‌బారు విమ‌ర్శ‌లు మానుకోవాల‌ని హిత‌వు ప‌లికారు. లేక‌పోతే తీవ్ర ప‌రిణామాలు ఎదుర్కోవాల్సి వ‌స్తుంద‌ని హెచ్చ‌రించారు.

త‌న చేతిలో మీడియా ఉంద‌ని అడ్డ‌గోలుగా ఆరోప‌ణ‌లు చేస్తామంటే చూస్తూ ఊరుకోమ‌న్నారు. ఇప్ప‌టికే రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం అమ‌లు అవుతోంద‌న్నారు. ఎవ‌రు త‌ప్పు చేసినా ఊరుకునేది లేద‌ని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచారు నారా లోకేష్.

ద‌మ్ముంటే త‌ను చేసిన ఆరోప‌ణ‌ల‌ను నిరూపించాల‌ని స‌వాల్ విసిరారు మంత్రి. చిల్ల‌ర మ‌ల్ల‌ర రాజ‌కీయాలు చేయ‌డం వ‌ల్ల‌నే త‌న పార్టీకి ప్ర‌జ‌లు త‌గిన రీతిలో గుణ‌పాఠం చెప్పార‌ని, కేవ‌లం 11 సీట్ల‌కే ప‌రిమితం చేశార‌న్నారు నారా లోకేష్‌.

Leave A Reply

Your email address will not be published.

Social Media Auto Publish Powered By : XYZScripts.com