మ‌హిళ‌ల‌కు అవ‌మానం లోకేష్ ఆగ్ర‌హం

కాల గ‌ర్భంలో క‌లిసి పోవ‌డం ఖాయం

అమ‌రావ‌తి – మంత్రి నారా లోకేష్ నిప్పులు చెరిగారు. మహిళల్ని అవమానించిన వారు కాలగర్భంలో కలిసిపోవడం ఖాయమ‌న్నారు. జ‌గ‌న్ రెడ్డికి మ‌హిళ‌లంంటే ముందు నుంచి గౌర‌వం లేద‌న్నారు. ఆయ‌న‌కు అధికారంపై ఉన్నంత యావ ప్ర‌జ‌ల‌పై లేద‌న్నారు. అమ్మల ఆత్మాభిమానం మీద, అమరావతి మీద విద్వేషంతో చేస్తున్న అసత్య ప్రచారం మీ దిగజారుడుతనానికి పరాకాష్ట అని పేర్కొన్నారు. ఆకాశంపై ఉమ్మేయాలనుకుంటే, అది మీ మీదే పడుతుందని గుర్తుంచు కోవాల‌న్నారు. అమరావతిపై విషం చిమ్మాలనుకుంటే అది మీ తాడేపల్లి ప్యాలెస్‌లో పడుతుందని హెచ్చ‌రించారు.

అమరావతి ముమ్మాటికీ దేవతల రాజధానేన‌ని స్ప‌ష్టం చేశారు నారా లోకేష్. భూములను త్యాగాలు చేసిన అమ్మల అమరావతి. మూడు రాజధానుల కపట కుట్ర పొత్తిళ్లలో తంతుంటే, జై అమరావతి అని నినదించిన శాంతమూర్తుల పవిత్ర భూమి మన రాజధాని అని పేర్కొన్నారు. జగన్ అనే సైతాన్‌ను తరిమేసిన అన్ని మతాల దేవతలు, దేవుళ్లు కొలువైన రాజధాని అమరావతి. కన్నతల్లిని, సొంత చెల్లిని తరిమేసిన దుర్మార్గుడికి మహిళల త్యాగాలు, గొప్పతనం ఏం తెలుస్తుందని నిల‌దీశారు.

మహిళల జోలికి వచ్చినా, ఆడపిల్లలను అల్లరి చేసినా, అఘాయిత్యాలకు పాల్పడినా వారికి అదే చివరి రోజు అని మా ముఖ్యమంత్రి చంద్రబాబు పదేపదే హెచ్చరిస్తున్నారు. విద్యార్థి దశ నుంచే మహిళలను గౌరవించేలా పాఠాలు బోధిస్తున్నాం. మహిళల ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసేలా మాట్లాడిన వారిని చట్ట ప్రకారం శిక్షిస్తున్నాం. అమరావతిపై విషం చిమ్మేందుకు జన్మనిచ్చిన అమ్మలను, జన్మంతా మనతో నడిచిన మహిళా లోకాన్ని కించపరిచిన జగన్ రెడ్డి గ్యాంగ్‌ని ఎట్టి పరిస్థితుల్లో క్షమించమ‌ని వార్నింగ్ ఇచ్చారు నారా లోకేష్‌.

Leave A Reply

Your email address will not be published.

Social Media Auto Publish Powered By : XYZScripts.com