హైదరాబాద్ – బీసీకి చెందిన ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నపై సంచలన ఆరోపణలు చేశారు కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే మందుల సామేల్. తాను వైన్ షాపుల ఓనర్స్ సిండికేట్ తో మామూళ్లు అడిగానంటూ వీడియో రిలీజ్ చేయడం పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదంతా కావాలని చేశారని ఆరోపించారు. తనను ఇరికించే ప్రయత్నం చేశారంటూ ఫైర్ అయ్యారు. తనను వ్యక్తిగతంగా డ్యామేజ్ చేసేందుకు ప్రయత్నం చేశాడని మండిపడ్డారు. ఈ మేరకు మందుల సామేల్ ఆవేదన వ్యక్తం చేశారు. తనపై చర్యలు తీసుకోవాలని కోరుతూ పోలీస్ స్టేషన్ లో ప్రత్యక్షం అయ్యారు. మల్లన్నపై చర్యలు తీసుకోవాలని కేసు నమోదు చేయాలని అన్నారు.
ఎమ్మెల్యే సామేల్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. విడుదల చేసిన వీడియోలో తన ప్రమేయం లేదన్నారు. తాను ఎక్కడా కనిపించ లేదని అన్నారు. ఎక్కడైనా తాను కనిపించానా అని ప్రశ్నించారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎమ్మెల్యే వీడియో వైరల్ గా మారింది. హల్ చల్ కావడంతో దీనిపై ఎలాంటి కామెంట్స్ చేయలేదు ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న.
వైరల్ వీడియోపై తీన్మార్ మల్లన్నను ఎమ్మెల్యే తప్పుబట్టారు. సోషల్ మీడియాలో వీడియోను ప్రసారం చేయడం ద్వారా తనను అప్రతిష్టపాలు చేయడానికి కుట్ర పన్నారని తుంగతుర్తి ఎమ్మెల్యే ఎం. సామ్యూల్ ఆరోపించారు. కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.