ఢిల్లీ – కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్ ఇచ్చింది కేంద్రం. ప్రపంచ వ్యాప్తంగా దేశాలతో సంప్రదింపులు జరిపేందుకు ఏడు డెలిగేట్స్ ను ఏర్పాటు చేసింది. ఈ తరుణంలో కాంగ్రెస్ పార్టీ నుంచి తమ పేర్లను పంపించాలని కోరింది. పంపించిన జాబితాలో తిరువనంతపురం ఎంపీ శశి థరూర్ పేరు లేదు. అయితే అనూహ్యంగా తనను అమెరికాకు పంపించే ప్రతినిధుల బృందానికి తనను నాయకత్వం వహించేందుకు ఎంపిక చేసింది.
పాకిస్తాన్ నుండి ఉద్భవించే ఉగ్రవాదంపై భారతదేశం వైఖరిని వ్యక్తీకరించడానికి విదేశాలకు పంపబడుతున్న ప్రతినిధుల బృందాలలో చేర్చడానికి నాలుగు పేర్లను సూచించాలని కేంద్ర మంత్రి కిరెన్ రిజిజు అభ్యర్థించారు. లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ కాంగ్రెస్ తరపున నాలుగు పేర్లు సూచించారు. ఇందులో మాజీ క్యాబినెట్ మంత్రి ఆనంద్ శర్మ, లోక్సభలో పార్టీ ఉప నాయకుడు గౌరవ్ గొగోయ్, రాజ్యసభ ఎంపీ డాక్టర్ సయ్యద్ నసీర్ హుస్సేన్ , లోక్సభ ఎంపీ రాజా బ్రార్ ను ప్రతిపాదించారు.
ఈ సందర్బంగా పంపించిన జాబితాలో చేర్చలేదు శశి థరూర్ ను. కాగా తను తిరువనంతపురం నుంచి నాలుగుసార్లు ఎంపీగా ఎన్నికయ్యాడు. ఇదిలా ఉండగా అఖిలపక్ష ప్రతినిధి బృందానికి నాయకత్వం వహిస్తారని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రకటించింది. బిజెపి నాయకులు రవిశంకర్ ప్రసాద్ , బైజయంత్ పాండా, జనతాదళ్ (యునైటెడ్) ఎంపి సంజయ్ కుమార్ ఝా, డిఎంకెకు చెందిన కనిమొళి కరుణానిధి, ఎన్సిపి (శరద్ పవార్ వర్గం) నాయకురాలు సుప్రియా సులే, శివసేన (షిండే వర్గం) ఎంపి శ్రీకాంత్ షిండే వంటి వారు ఇతర సభ్యులలో ఉన్నారు.