రుక్మిణి వ‌సంత్ కు వ‌రుస ఛాన్స్ లు

త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్ మూవీలో ఆఫ‌ర్

త‌మిళ సినీ రంగానికి చెందిన రుక్మిణి వ‌సంత్ ఇపుడు సెంట‌ర్ ఆఫ్ అట్రాక్ష‌న్ గా మారింది. త‌ను ప్ర‌స్తుతం ప‌లు సినిమాల‌లో కీ రోల్స్ పోషిస్తోంది. త‌న‌ను ల‌క్కీ గ‌ర్ల్ గా భావిస్తున్నారు ద‌ర్శ‌క, నిర్మాత‌లంతా. దీంతో త‌న‌కు ఛాన్స్ లు ఇచ్చేందుకు క్యూ క‌డుతున్నారు. త‌మ సినిమాల‌లో న‌టించ‌మ‌ని కోరుతున్నారు. దీంతో త‌ను న‌టిస్తే చాలు మూవీ ప‌క్కా స‌క్సెస్ అవుతుంద‌ని న‌మ్ముతున్నారు. ప్ర‌స్తుతం త‌ను న‌టించిన చిత్రం ఏస్ విడుద‌ల‌కు సిద్దంగా ఉంది.

ఈ సినిమాకు సంబంధించి పోస్ట‌ర్స్ , టీజ‌ర్, ట్రైల‌ర్ , సాంగ్స్ ను మూవీ మేక‌ర్స్ విడుద‌ల చేశారు. ఫీల్ గుడ్ క‌లిగించేలా దీనిని తీశాడు ద‌ర్శ‌కుడు. యువ డైరెక్ట‌ర్ కు బిగ్ చాన్స్ ఇచ్చాడు. తాజాగా రుక్మిణి వ‌సంత్ కు సంబంధించి కీల‌క అప్ డేట్ వ‌చ్చింది. అదేమిటంటే త‌ను టాలీవుడ్ లో ఛాన్స్ ద‌క్కించుకుంద‌ని వినికిడి. విక్ట‌రీ వెంక‌టేశ్ కీల‌క పాత్ర పోషిస్తున్న న్యూ మూవీలో త‌న‌ను ద‌ర్శ‌కుడు , మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్ ఎంపిక చేసిన‌ట్లు స‌మాచారం.

దీనిపై క్లారిటీ కూడా ఇచ్చాడు ద‌ర్శ‌కుడు. ఇప్ప‌టికే డైరెక్ట‌ర్ పై ఫుల్ కాన్ఫిడెన్స్ తో ఉన్నారంతా ఫ్యాన్స్. ఇప్ప‌టికే త‌ను గ‌తంలో తీసిన చిత్రాల‌న్నీ బిగ్ హిట్ గా నిలిచాయి. మ‌హేష్ తో తీసిన అత‌డు సెన్సేష‌న్. బ‌న్నీతో తీసిన స‌న్నాఫ్ స‌త్యమూర్తి, ప‌వ‌న్ క‌ళ్యాణ్ తో తీసిన అత్తారింటికి దారేది బిగ్ స‌క్సెస్ గా నిలిచాయి. ఇదే స‌మ‌యంలో ప్రిన్స్ తో గ‌త ఏడాది తీసిన గుంటూరు కారం మిక్స్ డ్ టాక్ తెచ్చుకుంది. ఇప్పుడు వెంకీ మామ‌తో తాను సినిమా తీస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు.

Leave A Reply

Your email address will not be published.

Social Media Auto Publish Powered By : XYZScripts.com