మాజీ ప్ర‌ధాని షేక్ హ‌సీనాపై విచార‌ణ

వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు

బంగ్లాదేశ్ మాజీ ప్ర‌ధాన‌మంత్రి షేక్ హ‌సీనాకు కోలుకోలేని షాక్ త‌గిలింది. త‌న పాల‌నా కాలంలో అప్ర‌జాస్వామికంగా వ్య‌వ‌హ‌రించార‌ని, త‌న‌కు ఎదురు లేకుండా ఉండేందుకు పెద్ద ఎత్తున దాడులు ప్రోత్స‌హించేలా, పోలీసుల‌ను ఉసిగొల్పిందంటూ ప్రస్తుత ప్ర‌భుత్వం ఆరోపించింది. త‌ను విచార‌ణ‌కు హాజ‌రు కావాల‌ని ఆదేశించింది. ఈ మేర‌కు హ్యూమానిటీస్ ఇన్వెస్టిగేటివ్ నివేదిక విడుద‌ల చేసింది. నేరాల‌కు పాల్ప‌డిన‌ట్లు ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న షేక్ హ‌సీనా సామూహిక ప్రాణ న‌ష్టానికి దారి తీసిన వ్య‌వ‌హారం పూర్తిగా బ‌ట్ట‌బ‌య‌లు అయ్యింద‌ని పేర్కొంది.

ఇదిలా ఉండ‌గా బంగ్లాదేశ్ ను షేక్ హ‌సీనా 15 ఏళ్ల పాటు పాలించింది. గ‌త ఏడాది ఆగ‌స్టులో త‌న ప‌ద‌వికి రాజీనామా చేసింది. ప్ర‌జ‌లు , యువ‌త తిరుగుబాటు చేయ‌డంతో ప్రాణ భ‌యంతో ఆ దేశం నుంచి పారి పోయారు. భార‌త దేశంలో త‌ల దాచుకున్నారు.

2024 విద్యార్థుల నేతృత్వంలోని తిరుగుబాటులో హింసాత్మక అణిచివేతలలో వారి పాత్రలు పోషించినందుకు మాజీ ప్రధాన మంత్రి షేక్ హసీనా, ఇద్దరు సీనియర్ అధికారులపై బంగ్లాదేశ్ ప్రాసిక్యూటర్లు నేరస్థులపై అభియోగాలు మోపారు.

ఈ హ‌త్య‌లు ప్ర‌ణాళిక ప్ర‌కారం చేయ‌బ‌డ్డాయంటూ చీఫ్ ప్రాసిక్యూట‌ర్ తాజ‌ల్ ఇస్లాం స్ప‌ష్టం చేశారు. ఈ కేసులో 81 మందిని సాక్షులుగా జాబితా చేసింది. హ‌సీనా దేశానికి అధిప‌తిగా హింస‌ను ప్రేరేపించేలా, కాల్పుల‌కు తెగ‌బ‌డేలా ఆదేశాలు ఇచ్చిందంటూ ఆరోపించారు ఇస్లాం.

Leave A Reply

Your email address will not be published.

Social Media Auto Publish Powered By : XYZScripts.com