భారత క్రికెట్ జట్టులో రారాజుగా వెలుగొందిన క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోనీ. తను ఇప్పటికే వన్డే, టి20, టెస్టు ఫార్మాట్ లకు దూరంగా ఉన్నాడు. ప్రస్తుతం ఇండియన్ ప్రిమీయర్ లీగ్ (ఐపీఎల్) లో ఆడుతూ వచ్చాడు. తను ప్రాతినిధ్యం వహిస్తున్న చెన్నై సూపర్ కింగ్స్ నుంచి నిష్క్రమించనున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది.
ఈసారి జరుగుతున్న ఐపీఎల్ 2025లో ఇదే తన కెరీర్ పరంగా ఆఖరిది కాబోతోందంటూ టాక్. తను ప్రాతినిధ్యం వహిస్తున్న జట్టు అత్యంత పేలవమైన ప్రదర్శనతో నిరాశ పరిచింది. తనకు కోట్లాది మంది అభిమానులు ఉన్నారు. ఈ టోర్నీలో 13 మ్యాచ్ లు ఆడింది చెన్నై సూపర్ కింగ్స్. కేవలం 3 మ్యాచ్ లు మాత్రమే గెలుపొందింది.
పాయింట్ల పట్టికలో ఆఖరున నిలిచింది ఆ జట్టు. దీనికి తాను పూర్తిగా బాధ్యత వహిస్తున్నట్లు స్పష్టం చేశాడు. కొత్త ఆటగాడికి పగ్గాలు అప్పగించింది యాజమాన్యం. అయితే జట్టుకు తానే అన్నీ. తనపై నిర్ణయం తీసుకోవాలంటే తనను సంప్రదిస్తుంది. తన ఇమేజ్ ఇంకా కొనసాగుతూనే ఉంది. దాదాపు తన మార్కెట్ వాల్యూ కనీసం రూ. 1000 కోట్లకు పైగా ఉంటుందని క్రికెట్ వర్గాల అంచనా.
ఈ తరుణంలో తనను ఏ మాత్రం వదులు కోవడానికి ఒప్పుకోదు చెన్నై టీం మేనేజ్ మెంట్. తనను తమ జట్టుకు హెడ్ కోచ్ గా లేదా మెంటార్ గా నియమించుకునే ఛాన్స్ ఉంది. ఈ తరుణంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడనే దానిపై ఉత్కంఠ నెలకొంది.