చెన్నై – మెగా ఐపీఎల్ 2025 టోర్నీ నుంచి చెన్నై సూపర్ కింగ్స్ నిష్క్రమించింది. చెన్నై వేదికగా జరిగిన లీగ్ మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ జట్టు చేతిలో 6 వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. ప్రత్యర్థి జట్టు ముందు భారీ టార్గెట్ నిర్దేశించినా బౌలింగ్ పరంగా అంతగా ఆకట్టుకోలేక పోయామని పేర్కొన్నాడు స్కిప్పర్ మహేంద్ర సింగ్ ధోనీ. మ్యాచ్ ముగిసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఇంకా కొన్ని పరుగులు ఎక్కువగా చేసి ఉన్నట్లయితే రాజస్థాన్ పై గెలిచి ఉండేవారమని చెప్పాడు.
ప్రత్యేకించి ఆయన రాజస్థాన్ ప్లేయర్ల ఆట తీరు గురించి కీలక వ్యాఖ్యలు చేశాడు. యంగ్ క్రికెటర్లు యశస్వి జైశ్వాల్, బీహార్ కుర్రాడు వైభవ్ సూర్య వంశీతో పాటు కెప్టెన్ సంజూ శాంసన్ అద్బుతంగా ఆడారంటూ ప్రశంసించాడు. ఆఖరున సంజూ, వైభవ్, రియాన్ పరాగ్ లను వెంట వెంటనే పెవిలియన్ బాట పట్టించామని, ఆ సమయంలో కొంత ఒత్తిడి పెంచేలా చేశామన్నాడు.
కానీ మైదానంలోకి వచ్చిన ధ్రువ్ జురైల్, విండీస్ స్టార్ ప్లేయర్ సిమ్రాన్ హెట్మెయిర్ కారణంగా తాము ఓటమి పొందాల్సి వచ్చిందన్నాడు. ఆ సమయంలో జురైల్ ఫోర్లు, సిక్సర్లు వెంట వెంటనే కొట్టడం, తమ టార్గెట్ ను అధిగమించడం జరిగిందన్నాడు. మొత్తంగా మ్యాచ్ లు అన్నాక గెలుపు ఓటములు సహజమన్నాడు. వచ్చే సీజన్ లో మెరుగైన ఆట తీరు ప్రదర్శిస్తామని చెప్పాడు మహేంద్ర సింగ్ ధోనీ.