టాలీవుడ్ లో నటించింది కొన్ని మూవీస్ మాత్రమే. కానీ ప్రేక్షకులకు దగ్గరయ్యాడు నారా రోహిత్. నారా వారి ఫ్యామిలీ లో తను మాత్రమే నటుడు. మిగతా వారంతా రాజకీయ రంగంలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. నారా రోహిత్ ఎవరో కాదు స్వయంగా ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు సోదరుడు నారా రామ్మూర్తి నాయుడి కొడుకు. తను అనారోగ్యంతో ఇటీవలే మృతి చెందాడు. ఆయన తనయుడే నారా రోహిత్.
ఒకప్పుడు విలక్షణ పాత్రలను ఎంపిక చేసుకుని, బలమైన కథలతో ముందుకు వచ్చాడు. తనను ప్రేక్షకులు ఆదరించారు..అక్కున చేర్చుకున్నారు. కొంత కాలం గ్యాప్ తీసుకున్నాడు. తాజాగా కీలక ప్రకటన చేశాడు. ప్రస్తుతం తను భైరవం చిత్రంలో నటించాడు. తనతోపాటు మంచు మనోజ్ కూడా ఇందులో నటించాడు. ఇటవలే ట్రైలర్ కూడా విడుదలైంది. మంచి రెస్పాన్స్ వచ్చింది.
ఈ సందర్బంగా చిట్ చాట్ లో తన మనసులోని భావాలను పంచుకున్నాడు నారా రోహిత్. కీలక అప్ డేట్ ఇచ్చాడు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న చిత్రం ఓజీ. ఇది పడుతూ లేస్తూ వచ్చింది. తనతో స్క్రీన్ షేర్ చేసుకోవడం జీవితంలో మరిచి పోలేనంటూ పేర్కొన్నాడు. తనతో నటించాలన్న కోరిక ఇన్నాళ్లకు నెరవేరిందన్నాడు నారా రోహిత్.
ఇక ఓజీలో బాలీవుడ్ హీరో ఇమ్రాన్ హష్మీ తో పాటు ప్రియాంక మోహన్ పవన్ కు జోడిగా నటిస్తోంది. మరో రోల్ ను నారా రోహిత్ పోషిస్తుండడంతో ఉత్కంఠ నెలకొంది.