Narendra Modi Strong Warning :ముమ్మాటికీ కశ్మీర్ మాదే – భార‌త్

పాకిస్తాన్ కు మోదీ స్ట్రాంగ్ వార్నింగ్

Narendra Modi Strong Warning

Narendra Modi : ఢిల్లీ – దాయాది పాకిస్తాన్ కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు ప్ర‌ధాన‌మంత్రి మోదీ(Narendra Modi). పాక్ ఆక్ర‌మిత క‌శ్మీర్ ను ఆరు నూరైనా స‌రే చేజిక్కించు కుంటామ‌ని స్ప‌ష్టం చేశారు. చిల్ల‌ర వేషాలు వేస్తే చూస్తూ ఊరుకోమని అన్నారు . చ‌ట్ట విరుద్దంగా ఆక్ర‌మించుకున్న క‌శ్మీర్ ను ఖాళీ చేయాల్సిందేన‌ని అన్నారు మోదీ. ఈ డిమాండ్ ఎప్ప‌టికీ మార‌ద‌ని మ‌రోసారి ప్ర‌పంచానికి చాటి చెప్పారు.

Narendra Modi Strong Warning to Pakistan

ఇవాళ భార‌త్ అత్యంత బ‌లంగా ఉంద‌న్నారు. త్రివిధ ద‌ళాలు పాకిస్తాన్ ను మ‌ట్టు పెట్టేందుకు సిద్దంగా ఉన్నార‌ని, ఇప్ప‌టికే త‌మ స‌త్తా ఏమిటో చూపించామ‌న్నారు. అయినా త‌న బుద్దిని మార్చు కోవ‌డం లేద‌న్నారు మోదీ. ఇలాగే వ్య‌వ‌హ‌రిస్తూ పోతే చివ‌ర‌కు ప్ర‌పంచ ప‌టంలో పాకిస్తాన్ అన్న పేరు లేకుండా పోతుంద‌ని హెచ్చ‌రించారు.

అక్ర‌మంగా దొంగిలించ బడిన భూభాగాన్ని తిరిగి ఇవ్వడం తప్ప కాశ్మీర్‌పై పాకిస్తాన్‌తో ఎటువంటి చర్చ ఉండద‌న్నారు మోదీ. ఈ విష‌యాన్ని స్వ‌యంగా వెల్ల‌డించింది పీఎం త‌ర‌పున విదేశాంగ శాఖ మంత్రిత్వ శాఖ‌. పాకిస్తాన్ గతంలో మధ్యవర్తిత్వాన్ని కోరినప్పటికీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రెండుసార్లు దీనిని ప్రతిపాదించినప్పటికీ, ఈ సమస్యను ద్వైపాక్షికంగా పరిష్కరించు కోవాలని భారతదేశం కూడా నిశ్చయించుకుందని పేర్కొంది.

Also Read : PM Modi Strong Counter :ట్రంప్ కామెంట్స్ మోదీ సీరియ‌స్

Leave A Reply

Your email address will not be published.

Social Media Auto Publish Powered By : XYZScripts.com