టాలీవుడ్ లో ఇప్పుడు నటుడిగా గుర్తింపు పొందిన నాని రూట్ మార్చేశాడు. ఇప్పటి వరకు ప్రేక్షకులలో నేచురల్ స్టార్ గా గుర్తింపు పొందిన నటుడు ఉన్నట్టుండి తాజాగా కొత్త రోల్ లోకి ప్రవేశించాడు. తను నిర్మాతగా మారాడు. తను తీసిన తాజా చిత్రం కోర్టు విడుదలైంది. అద్భుతమైన టాక్ తెచ్చుకుంది. భారీ వసూళ్లను సాధించింది. తక్కువ బడ్జెట్ తో తీసిన ఈ మూవీ సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఓటీటీ సంస్థలు ఈ సినిమాను చేజిక్కించుకునేందుకు, స్ట్రీమింగ్ చేసేందుకు భారీ ఎత్తున పోటీ పడ్డాయి. మరో సంస్థ రూ. 8 కోట్లకు తీసుకున్నట్లు టాక్.
ఇదిలా ఉండగా నాని నటించిన మరో చిత్రం హిట్ -3 సూపర్ షో చేసింది. దిగ్గజ సంస్థ నెట్ ఫ్లిక్స్ దీనిని హ్యూజ్ ప్రైజ్ కు దక్కించుకుంది. మే 29న స్ట్రీమింగ్ కానుంది హిట్ -3 . ఇదిలా ఉండగా మే 1న ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా విడుదలైంది. ఏకంగా రూ. 100 కోట్లకు పైగా కొల్లగొట్టింది. సినీ వర్గాలను విస్తు పోయేలా చేసింది. ఈ ఏడాది భారీ చిత్రాలు బోల్లా పడగా ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన మూవీస్ మాత్రం కెవ్వు కేక అనిపించేలా ఉన్నాయి.
నాని నిర్మించిన కోర్టు, నందమూరి బాలకృష్ణ నటించిన డాకు మహారాజ్ , అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన దిల్ రాజు నిర్మించిన సంక్రాంతికి వస్తున్నాం మూవీస్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. బాలయ్య మూవీ రూ. 130 కోట్లు కలెక్షన్స్ చేస్తే విక్టరీ వెంకటేశ్ మూవీ మాత్రం ఏకంగా రూ. 300 కోట్లకు పైగా వసూలు చేసింది. మొత్తంగా నేచురల్ స్టార్ సెన్సేషన్ స్టార్ గా మారి పోయాడు.