ఆది సాయి కుమార్ గతంలో పలు చిత్రాలలో నటించాడు. ఆ తర్వాత కొంత కాలం గ్యాప్ ఇచ్చాడు. తాజాగా తను నటించిన చిత్రం శంబాల. ఈ మూవీకి సంబంధించి కీలక అప్ డేట్ ఇచ్చారు మూవీ మేకర్స్. ఇవాళ టీజర్ విడుదలైంది. ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అద్భుతంగా ఉందంటూ ప్రశంసలు కురుస్తున్నాయి. బ్లాక్ బస్టర్ కావడం పక్కా అంటున్నారు చూసిన వారంతా. చిత్రాన్ని దర్శకుడు అద్భుతంగా తెరకెక్కించడంలో సక్సెస్ అయ్యాడు. దీనిని పూర్తిగా నేచురల్ థ్రిల్లర్ గా తీశాడు. శంబాల ఏ మిస్టికల్ వరల్డ్ అంటూ పేర్కొన్నాడు డైరెక్టర్.
శంబాల చిత్రాన్ని షైనింగ్ పిక్చర్స్ పతాకంపై మహీధర్ రెడ్డి, రాజశేఖర్ కలిసి నిర్మించారు. తొలిసారిగా దీనికి యుగంధర్ ముని దర్శకత్వం వహించారు. ఇందులో ఆది సాయి కుమార్ తో పాటు స్వాసిక, అర్చన అయ్యర్, రవివర్మ, మధునందన్, శివ కార్తీక్ తదితరులు కీ రోల్స్ పోషించారు. ఇప్పటి వరకు మూవీ మేకర్స్ శంబాలకు సంబంధించిన పోస్టర్స్ మంచి ఆదరణ పొందాయి. ఇటీవలే వీడియో మేకింగ్ కూడా ముందుకు తీసుకు వచ్చారు.
ఇక శంబాల మూవీలో గుండెలను తాకేలా ఉన్నాయి సంభాషణలు. ఇందులో విశ్వం గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఇందులో అంతు చిక్కని రహస్యాలు ఎన్నో ఉన్నాయి. సైన్స్ కే సమాధానం దొరకని సమయంలో మూఢ నమ్మకాలు రాజ్యం ఏలుతున్నాయి. కానీ ఆన్సర్ లభిస్తే అది మూఢ నమ్మకం కాక పోతే అది తన గొప్పదనం అంటుంది అంటూ పేల్చిన డైలాగ్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారింది.