Nayanthara: మరోసారి మమ్ముట్టితో జత కట్టనున్న నయనతార !

మరోసారి మమ్ముట్టితో జత కట్టనున్న నయనతార !

Hello Telugu - Nayanthara

Nayanthara: విభిన్నమైన పాత్రలు, విలక్షణమైన నటనతో ఛాలెంజింగ్ ప్రాజెక్టులను ఎంచుకోవడంలో ముందుండే మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి… ‘భ్రమయుగం’ సినిమాతో ఈ ఏడాదిని విజయవంతంగా మొదలుపెట్టారు. ‘భూతకాలం’ ఫేమ్ రాహుల్‌ సదాశివన్‌ దర్శకత్వంలో తెరకెక్కించిన ‘భ్రమయుగం’ సినిమాల్లో తన నటనతో తనను తాను కొత్తగా తెరపై ఆవిష్కరించుకున్నారు. బ్లాక్ అండ్ వైట్‌ లో మూడే పాత్రలతో తీసిన ‘భ్రమయుగం’ సినిమాలో మాంత్రికుడి పాత్రతో… తన సత్తా ఎంటో నిరూపించాడు. దాని తర్వాత ‘టర్బో’ చిత్రంతో యాక్షన్‌ హంగామా చేశారు. ఇప్పుడు మరో కొత్త చిత్రాన్ని పట్టాలెక్కించారు మమ్ముట్టి.

Nayanthara Movies Update

ప్రముఖ తమిళ దర్శకుడు గౌతమ్‌ వాసుదేవ్‌ మేనన్‌ దర్శకత్వంలో ఓ సినిమాను ప్రారంభించారు మమ్ముట్టి. ఈ ప్రాజెక్టుతో మలయాళంలో అడుగుపెట్టనున్నారు దర్శకుడు గౌతమ్‌ మీనన్. ఇది ముమ్ముట్టి నిర్మిస్తున్న ఆరవ సినిమా కాగా ఇటీవలే ఈ సినిమా షూటింగ్ ను ప్రారంభించారు. విభిన్నమైన కథనాలతో ప్రేక్షకులను అలరించే గౌతమ్‌ మేనన్‌ ఇప్పుడు మమ్ముట్టి ప్రధాన పాత్రలో ఎలాంటి కథతో వస్తున్నారోనన్న ఆసక్తి మొదలైంది. ఇందులో మమ్ముట్టికి జోడీగా లేడీ సూపర్ స్టార్ నయనతార(Nayanthara) ఎంపిక చేసినట్లు సమాచారం. దీనితో ఈ సినిమాపై అంచనాలు మరింత పెరిగిపోయాయి. ఈ సినిమాతో ముచ్చటగా మూడోసారి జత కట్టిన ముమ్ముట్టి, నయనతార జంట ఎలా అలరిస్తుందో తెలియాలంటే ఇంకొన్ని రోజులు వేచి చూడాల్సిందే.

Also Read : Srinidhi Shetty: టాలీవుడ్ లో శ్రీనిధీ శెట్టి డబుల్‌ ధమాకా ?

Leave A Reply

Your email address will not be published.

Social Media Auto Publish Powered By : XYZScripts.com