Beauty Nayanthara :దేవ‌త పాత్ర కోసం నెల రోజుల ఉప‌వాసం

త‌న‌కిచ్చిన పాత్ర‌కు న్యాయం చేసేందుకోసం

Nayanthara : ద‌క్షిణాదిన లేడీ అమితాబ్ అని పేరు తెచ్చుకున్న న‌టి న‌య‌నతార‌(Nayanthara). త‌ను విగ్నేష్ శివ‌న్ తో పెళ్లి చేసుకున్నాక ఇద్ద‌రు క‌వ‌ల పిల్ల‌ల‌కు జ‌న్మ‌నిచ్చింది. అయినా ఎక్క‌డా త‌న ఫిజిక్ త‌గ్గ‌కుండా చూసుకుంటూ వ‌స్తోంది. త‌న‌కు వృత్తి ప‌ట్ల‌, ప్ర‌త్యేకించి మూవీ రంగం ప‌ట్ల ఉన్న నిబ‌ద్ద‌త‌కు నిద‌ర్శ‌నం. త‌ను సినిమా ప్రాజెక్టును ఒప్పుకుందంటే ఇక వేరే ఏమీ ఆలోచించ‌దు. ఇచ్చిన పాత్ర కోసం ప్రాణం పెడుతుంది.

Nayanthara Comments

గ‌త ఏడాది బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ తో క‌లిసి జ‌వాన్ లో న‌టించింది. అంద‌రూ విస్తు పోయేలా పోరాట స‌న్నివేశాల‌లో పాల్గొంది. ఇది బ్లాక్ బ‌స్ట‌ర్ గా నిలిచింది. దీనికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు అట్లీ కుమార్. ఈ మూవీ ఏకంగా రూ. 1000 కోట్లు వ‌సూలు చేసింది. బాద్ షా కెరీర్ లో ప్ర‌త్యేకించి న‌య‌న్ కెరీర్ లో హ‌య్యెస్ట్ వ‌సూలు చేసిన మూవీగా నిలిచి పోయింది. తాజాగా మ‌రో ప్రాజెక్టు పై ఫోక‌స్ పెట్టింది.

అదే అమ్మ‌న్ 2 . ఇది సీక్వెల్ మూవీ. ఈ సినిమా చిత్రీక‌ర‌ణ స‌మయంలో ఎక్క‌డా త‌గ్గ‌కుండా ఇచ్చిన పాత్ర కోసం ఏకంగా నెల రోజుల పాటు ఉప‌వాసం ఉన్నారు. ఈ విష‌యాన్ని త‌నే స్వ‌యంగా వెల్ల‌డించింది లేడీ సూప‌ర్ స్టార్ న‌య‌న తార‌. ఈ చిత్రంలో త‌న‌తో పాటు రెజీనా కాసాండ్రా, క‌న్న‌డ న‌టుడు దునియా విజ‌య్ తో పాటు క‌మెడియ‌న్ యోగి బాబు , సింగం పులి, గోపి అమ‌ర్ నాథ్ న‌టించారు. న‌య‌న్ చెప్పిన విష‌యాన్ని ధ్రువీక‌రించారు నిర్మాత ఇషారి కె. గ‌ణేశ్. ఈ చిత్రంలో దేవ‌త పాత్ర‌లో న‌టించేందుకు ఇలా చేసింద‌ని ఆమె క‌మిట్మెంట్ గొప్ప‌ద‌న్నారు.

Also Read : Ranya Rao Shocking :17 బంగారు క‌డ్డీలు తెచ్చాన‌న్న ర‌న్యా రావు

Leave A Reply

Your email address will not be published.

Social Media Auto Publish Powered By : XYZScripts.com