నేహా శెట్టి అంటే ఎవరూ గుర్తు పట్టరు. కానీ డీజే టిల్లు మూవీలో రాధిక పాత్రను ఎవరైనా ఇట్టే గుర్తు పడతారు. ఆమెను మరిచి పోకుండా ఉండలేరు. ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు వరుస సినిమాలతో అలరించేందుకు ప్రయత్నం చేస్తోంది. తొలుత తెలుగు సినిమా రంగానికి సంబంధించి మెహబూబా సినిమాతో పరిచయం అయ్యింది.
ఆ సినిమా ఆశించినంత ఆడ లేక పోయింది. ఆ తర్వాత జొన్నలగడ్డ సిద్దుతో కలిసి నేహా శెట్టి నటించిన డీజే టిల్లు మూవీ బిగ్ సక్సెస్ అయ్యింది. ఇందులో నేహా శెట్టికి మంచి పేరు వచ్చింది. ఆ తర్వాత కొంత గ్యాప్ తీసుకుంది. కార్తికేయతో బెదురులంక 2012 చిత్రంలో నటించింది. ఇది వినోదాత్మక చిత్రంగా రూపు దిద్దుకుంది.
ఇది ఆగస్టు 12న విడుదలైంది. ఈ చిత్రం నవ్వులు పూయిస్తోంది. కిరణ్ అబ్బవరం తో కలిసి రూల్స్ రంజన్ చిత్రంలో నటించింది నేహా శెట్టి. ఈ మూవీకి మంచి ఆదరణ లభిస్తోంది. ఒకందుకు మంచి టాక్ రావడంతో సంతోషానికి లోనవుతోంది ఈ ముద్దుగుమ్మ.
ఇక విశ్వక్ సేన్ తో కలిసి గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి చిత్రంలో నటిస్తోంది ప్రస్తుతం నేహా శెట్టి. మొత్తంగా దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోవాలనే నానుడిని ఫాలో అవుతోంది ఈ లవ్లీ గర్ల్.