అంత‌ర్జాతీయ క్రికెట్ కు పూర‌న్ గుడ్ బై

వెస్టిండీస్ – ప్ర‌పంచ క్రికెట్ లో స్టార్ క్రికెట‌ర్ గా గుర్తింపు పొందిన వెస్టిండీస్ క్రికెట‌ర్ నికోల‌స్ పూర‌న్ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశాడు. తాను అంత‌ర్జాతీయ క్రికెట్ రంగం నుంచి త‌ప్పుకుంటున్న‌ట్లు వెల్ల‌డించాడు. కేవ‌లం త‌న వ‌య‌సు 29 ఏళ్లు మాత్ర‌మే. తాజాగా భార‌త్ లో జ‌రిగిన అత్యంత జ‌నాద‌ర‌ణ పొందిన ఇండియ‌న్ ప్రిమీయ‌ర్ లీగ్ (ఐపీఎల్) మెగా టోర్నీలో ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ టీం త‌ర‌పున ప్రాతినిధ్యం వ‌హించాడు. త‌న అద్భుత‌మైన ఆట తీరుతో ఆక‌ట్టుకున్నాడు. ప‌రుగుల వ‌ర‌ద పారించాడు. త‌ను ఇంకా ఆడేందుకు ఛాన్స్ ఉన్న‌ప్ప‌టికీ ఎందుక‌నో స‌డన్ గా డెసిష‌న్ తీసుకోవంతో క్రికెట్ వ‌ర్గాలు విస్తు పోయాయి.

తాను వైదొలుగుతున్న విష‌యాన్ని ఇన్ స్టా స్టోరీస్ ద్వారా ప్ర‌క‌టించాడు నికోల‌స్ పూర‌న్. త‌ను వెస్టిండీస్ జ‌ట్టుకు ప్రాతినిధ్యం వ‌హించాడు. త‌న దేశం త‌ర‌పున ఎన్నో మ్యాచ్ ల‌ను ఒంటి చేత్తో గెలిపించిన చ‌రిత్ర త‌న‌కుంది. కెరీర్ ప‌రంగా చూస్తే త‌ను 61 వ‌న్డేలు, 106 టి20 మ్యాచ్ లు ఆడాడు. ఇదిలా ఉండ‌గా వ‌చ్చే ఏడాది 2026లో టి20 వ‌ర‌ల్డ్ క‌ప్ జ‌ర‌గ‌నుంది. ఉన్న‌ట్టుండి రిటైర్మెంట్ ప్ర‌క‌టించ‌డం ప‌ట్ల క్రికెట్ అభిమానులు జీర్ణించు కోలేక పోతున్నారు. 4 వేలకు పైగా ప‌రుగులు చేశాడు.

4,000 కంటే ఎక్కువ పరుగులు చేసిన అతను అంతర్జాతీయ క్రికెట్‌కు రాజీనామా చేస్తున్నాడు. టా టా ఐపీఎల్ లో ల‌క్నో త‌ర‌పున 200 స్ట్రైక్ రేట్ తో 14 మ్యాచ్ లు ఆడాడు. 524 ప‌రుగులు చేశాడు. ఇందులో ఫోర్లు, సిక్స‌ర్లు ఉన్నాయి. ఇవాళ త‌ప్పుకోవ‌డం వెనుక చాలా ఆలోచించాను. రిటైర్ కు ఇదే త‌గిన స‌మ‌యమ‌ని తాను భావిస్తున్న‌ట్లు పేర్కొన్నాడు నికోల‌స్ పూర‌న్.

Leave A Reply

Your email address will not be published.

Social Media Auto Publish Powered By : XYZScripts.com