ఒక్కో నటుడికి కొన్ని పాత్రలు అరుదుగా వస్తుంటాయి. తమిళ సినీ రంగంలో తనకంటూ ఓ స్పెషల్ ఇమేజ్ స్వంతం చేసుకున్న హీరో ధనుష్. తను ఎంచుకున్న పాత్రలకు మంచి మార్కులే పడుతున్నాయి. ఓం రౌత్, అభిషేక్ అగర్వాల్ నిర్మించిన బయో పిక్ లో ధనుష్ మాజీ రాష్ట్రపతి, దివంగత అబ్దుల్ కలాం పాత్ర చేయనున్నారు. ఈ విషయాన్ని స్వయంగా మూవీ మేకర్స్ ప్రకటించారు.
తనకు ఏ పాత్ర ఇచ్చినా దానికి వంద శాతం న్యాయం చేసేందుకు ప్రయత్నం చేశాడు ధనుష్. తను నటించడమే కాకుండా నిర్మిస్తున్నాడు కూడా. టాలెంట్ కలిగిన సాంకేతిక నిపుణులను ప్రోత్సహిస్తాడు. భిన్నమైన కథలను ఎంచుకుంటాడు. పాత్రలు కూడా అంతే. తాజాగా ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న కేన్స్ ఫిలిం ఫెస్టివల్ లో ఈ విషయాన్ని స్వయంగా పంచుకున్నాడు హీరో.
తన్లాజీ , ఆన్సంగ్ వారియర్ , ఆదిపురుష్ చిత్రాలకు దర్శకత్వం వహించాడు ఓం రౌత్. బయో పిక్ మూవీకి తాజాగా దర్శకత్వం వహించాడు. అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ , ఎకె ఎంటర్టైన్మెంట్ పతాకంపై అభిషేక్ అగర్వాల్, అనిల్ సుంకర, భూషణ్ కుమార్, క్రిషన్ కుమార్ సంయుక్తంగా నిర్మిస్తుండడం విశేషం. గుల్షన్ కుమార్, తేజ్ నారాయణ్ అగర్వాల్ , టి సీరీస్ ఫిల్మ్స్ సమర్పిస్తున్నారు. కాగా ఈ బయో పిక్ మూవీకి ది మిస్సైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా అనే ట్యాగ్ లైన్ పెట్టారు దర్శకుడు.