హైదరాబాద్ – ఎంఐఎం పార్టీ చీఫ్, హైదరాబాద్ ఎంపీ ఓవైసీ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆయన ఆపరేషన్ సిందూర్ సక్సెస్ తర్వాత ఎవరూ ఊహించని రీతిలో భారత దేశం గురించి ప్రశంసలు కురిపిస్తున్నారు. ప్రధానంగా మోదీ తీసుకుంటున్న నిర్ణయాలను అభినందిస్తున్నారు. ఇదే సమయంలో తాజాగా ఓవైసీకి కీలక బాధ్యతలు అప్పగించింది మోదీ ప్రభుత్వం. భారత్ తీసుకున్న నిర్ణయం, పాకిస్తాన్ చేస్తున్న మోసాన్ని ఎండ గట్టేందుకు ప్రపంచానికి తెలియ చేసేందుకు ఏడు బృందాలతో ప్రతినిధులను ఎంపిక చేసింది. ఇందులో ఎవరూ ఊహించని రీతిలో కాంగ్రెస్ పార్టీ పంపించిన జాబితా లోనే తిరువనంతపురం ఎంపీ శశి థరూర్ తో పాటు ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీని చేర్చింది.
శశి థరూర్ ను అమెరికా డెలిగేట్స్ టీంకు ప్రాతినిధ్యం వహిస్తుండగా హైదరాబాద్ ఎంపీ సౌదీ అరేబియా, ఇతర అరబ్ దేశాలతో భారత్ తరపున తన వాయిస్ ను వినిపిస్తారు. ఈ సందర్బంగా ఓవైసీ మీడియాతో మాట్లాడారు. పాకిస్తాన్ భారతదేశాన్ని ఎలా అస్థిర పరచాలని అనుకుంటుందో ప్రపంచానికి తెలియ జేయడమే తన ముందున్న లక్ష్యమని స్పష్టం చేశారు. పాకిస్తాన్ మానవాళికి ముప్పు అని మేము ప్రపంచానికి చెప్పాలని అనుకుంటున్నట్లు ప్రకటించారు ఓవైసీ. పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని స్పాన్సర్ చేస్తోందని ఆరోపించారు.