మ‌ణిర‌త్నంకు పైడి జ‌య‌రాజ్ ఫిలిం అవార్డు

ప్ర‌క‌టించిన గ‌ద్ద‌ర్ తెలంగాణ అవార్డుల కమిటీ

ప్ర‌ముఖ చ‌ల‌న చిత్ర ద‌ర్శ‌కుడు మ‌ణిర‌త్నంకు అరుదైన పుర‌స్కారం ద‌క్కింది. తెలంగాణ‌లో కొత్త‌గా ఏర్ప‌డిన కాంగ్రెస్ ప్ర‌భుత్వం ప్ర‌తిష్టాత్మ‌కంగా గ‌ద్ద‌ర్ పేరుతో ఫిలిం అవార్డుల‌ను ప్ర‌క‌టించింది. 2014 నుంచి 2023 సంవ‌త్స‌రానికి గాను ఏక‌కాలంలో మొత్తం 30 సినిమాల‌ను ఎంపిక చేసింది. వివిధ కేట‌గిరీలలో పుర‌స్కారాలను వెల్ల‌డించింది. ఇందులో స్పెష‌ల్ కేట‌గిరీ కింద ఆరు విభాగాల‌ను ఎంపిక చేసింది.

ఎన్టీఆర్ పేరుతో ఏర్పాటు చేసిన అవార్డుకు నంద‌మూరి బాల‌కృష్ణ‌ను ఖరారు చేసింది. తెలంగాణ ప్రాంతానికి చెందిన పైడి జ‌య‌రాజ్ పేరుతో ఏర్పాటు చేసిన ఫిలిం అవార్డుకు సృజ‌నాత్మ‌కత క‌లిగిన ద‌ర్శక ధీరుడు మ‌ణిర‌త్నంను ఎంపిక చేసింది. ఆయ‌న‌ను ఖ‌రారు చేయ‌డం ప‌ట్ల స‌ర్వ‌త్రా హ‌ర్షం వ్య‌క్తం చేసింది.

భార‌తీయ సినీ రంగంలో ఆయ‌న ఓ సంచ‌ల‌నం. త‌ను తీసిన ప్ర‌తి మూవీ ఓ క్లాసిక్ అని చెప్ప‌క త‌ప్ప‌దు. త‌ను తీసిన తొలి చిత్రం రోజా అత్య‌ధిక వ‌సూళ్లు సాధించింది. ఆ త‌ర్వాత తీసిన నాయ‌కుడు రికార్డులు కొల్ల‌గొట్టింది. గ‌త ఏడాది తీసిన పొన్నియ‌న్ సెల్వ‌న్ సూప‌ర్ స‌క్సెస్ గా నిలిచింది. ఈ ఏడాది క‌మ‌ల్ హాస‌న్ , త్రిష‌, సిలాంబ‌ర‌స‌న్ తో థ‌గ్ లైఫ్ తీశాడు. ఆయ‌న సినిమాల ద్వారా ఎంద‌రో న‌టీ న‌టులు, సాంకేతిక నిపుణులు బ‌య‌ట‌కు వ‌చ్చారు. వారంద‌రికీ త‌ను లైఫ్ ఇచ్చాడు. ఎక్క‌డో జింగిల్స్ చేసుకుంటూ ఉన్న ఏఆర్ రెహ‌మాన్ ను రోజా కోసం మ్యూజిక్ డైరెక్ట‌ర్ గా ప‌రిచ‌యం చేశాడు. ఇవాళ ఆస్కార్ అవార్డును అందుకుని అంద‌నంత ఎత్తులో ఉన్నాడు.

Leave A Reply

Your email address will not be published.

Social Media Auto Publish Powered By : XYZScripts.com