Pakistan Shocking :భార‌త దౌత్య‌వేత్త‌ను బహిష్క‌రించిన పాకిస్తాన్

24 గంట‌ల లోపు దేశం విడిచి వెళ్లాల‌ని ఆదేశం

Pakistan : పాకిస్తాన్ – పాకిస్తాన్ క‌య్యానికి కాలు దువ్వుతోంది. భార‌త్ కు వ్య‌తిరేకంగా నిర్ణ‌యాలు తీసుకుంటోంది. ఇప్ప‌టికే భార‌త్ చేప‌ట్టిన ఆప‌రేష‌న్ సిందూర్ లో 110 మందికి పైగా ఉగ్ర‌వాదులు హ‌తం అయ్యారు. పాకిస్తాన్ కు చెందిన 11 మంది సైనికులు ప్రాణాలు కోల్పోయారు. ఈ త‌రుణంలో భార‌త ప్ర‌భుత్వం పాకిస్తాన్ హై క‌మిష‌న్ లో చ‌ట్ట వ్య‌తిరేక కార్య‌క‌లాపాల‌కు పాల్ప‌డుతున్నాడ‌ని, కీల‌క స‌మాచారాన్ని ఐఎస్ఐకి చేర‌వేస్తున్నాడ‌ని కేంద్ర స‌ర్కార్ త‌న‌పై వేటు వేసింది.

Pakistan Expels Indian Diplomat

ఈ విష‌యం తెలిసిన వెంట‌నే పాకిస్తాన్ చ‌ర్య‌కు ప్ర‌తిచ‌ర్య‌గా త‌మ దేశంలోని భార‌త హైక‌మిష‌న్ లో ప‌ని చేస్తున్న దౌత్య‌వేత్త‌ను బ‌హిష్క‌రిస్తున్న‌ట్లు ప్ర‌క‌టించింది. ఇందుకు గాను త‌క్ష‌ణ‌మే దేశం విడిచి వెళ్లి పోవాల‌ని పాకిస్తాన్ ప్ర‌భుత్వం ఆదేశించింది. ఏ మాత్రం ఆల‌స్యం చేసినా చ‌ర్య‌లు త‌ప్ప‌వ‌ని పేర్కొంది. ఇందుకు 24 గంట‌ల పాటు స‌మ‌యం ఇస్తున్న‌ట్లు తెలిపింది.

భారత హైకమిషన్ సిబ్బందిని తన ప్రత్యేక హోదాకు అనుకూలమైనద అని పిలిచే కార్యకలాపాలలో పాల్గొన్నందుకు పాకిస్తాన్ పర్సోనా నాన్ గ్రాటాగా ప్రకటించింది. పాకిస్తాన్ విడిచి వెళ్లాలని ఆదేశించినట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొంది.

Also Read : Narendra Modi Strong Warning :ముమ్మాటికీ కశ్మీర్ మాదే – భార‌త్

Leave A Reply

Your email address will not be published.

Social Media Auto Publish Powered By : XYZScripts.com