పాకిస్తాన్ – పాకిస్తాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. భారత దేశంతో చర్చలకు సిద్దంగా ఉన్నామని ప్రకటించారు. శాంతి కోసం తాము సిద్దంగా ఉన్నామని పేర్కొన్నారు. ప్రస్తుతం ఇరు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. ఈ తరుణంలో పీఎం చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
పంజాబ్ ప్రావిన్స్లోని కామ్రా వైమానిక స్థావరాన్ని సందర్శించారు షెహబాజ్ షరీఫ్. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. భారతదేశంతో ఇటీవల జరిగిన సైనిక ఘర్షణలో పాల్గొన్నారు. అధికారులు, సైనికులతో సంభాషించారు. ఇరు దేశాల మధ్య శాంతి నెలకొల్పేందుకు సిద్దంగా ఉన్నామని తెలిపారు.
కాశ్మీర్ సమస్య కూడా ఉందన్నారు పీఎం.
జమ్మూ కాశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతం, లడఖ్ కేంద్రపాలిత ప్రాంతం దానిలో అంతర్భాగం, విడదీయరాని భాగాలు అని ఇండియా పేర్కొందన్నారు. షెహబాజ్ తో పాటు ఉప ప్రధాన మంత్రి ఇషాక్ దార్, రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్, ఆర్మీ చీఫ్ జనరల్ అసిమ్ మునీర్, వైమానిక దళ అధిపతి, ఎయిర్ చీఫ్ మార్షల్ జహీర్ అహ్మద్ బాబర్ సిద్ధూ వైమానిక స్థావరానికి వచ్చారు.
డ్రోన్లు, క్షిపణి దాడుల తర్వాత మే 10న ఇండియా, పాకిస్తాన్ మధ్య జరిగిన సంఘర్షణను ముగించేందుకు తాము ఇప్పటికీ సిద్దంగా ఉన్నామని వెల్లడించారు పీఎం.