Shehbaz Shariff : పాకిస్తాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్(Shehbaz Shariff) సంచలన కామెంట్స్ చేశారు. భారత్ పై తాము విజయం సాధించామని ప్రకటించారు. ఆ దేశం తమతో యుద్దం చేయలేక పోయిందన్నారు. అంతే కాదు కాళ్ల బేరానికి వచ్చిందని అవాకులు పేలాడు. ఆపై మోదీనే తమతో కాళ్ల బేరానికి వచ్చాడంటూ పేర్కొన్నాడు. దీనిపై భారత దేశ వ్యాప్తంగా నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. నిన్నటి దాకా మోదీకి జై అంటూ జైకొట్టిన వారంతా తీవ్రంగా మండిపడుతున్నారు. యావత్ భారతమంతా ముక్త కంఠంతో పాకిస్తాన్ కు వ్యతిరేకంగా యుద్దం చేయాల్సిందేనంటూ కోరుకుంటుంటే కాల్పుల విరమణకు ఎందుకు ఒప్పుకున్నారంటూ ప్రశ్నిస్తున్నారు.
Shehbaz Shariff Shocking Viral Comments
ఇదిలా ఉండగా ఓ వైపు భారత్ ఉగ్రవాదంపై పోరాటం సాగిస్తుంటామని చెబుతున్నా మరో వైపు అమెరికా రెండు నాల్కల ధోరణి ప్రదర్శిస్తోంది. ఇంకో వైపు చైనా బహిరంగంగానే పాకిస్తాన్ కు మద్దతు ప్రకటించింది. ఇక టర్కీ ఇప్పటికే డ్రోన్లను, ఇతర సామాగ్రిని పంపించింది. ఇక బంగ్లాదేశ్ కావాలని పాకిస్తాన్ తో జతకట్టింది. ఇదే సమయంలో భారత్ మాత్రం చేష్టలుడిగి పోవడం పట్ల తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. ఈ తరుణంలో కాల్పుల విరమణ పాటించ వద్దని వెంటనే పాకిస్తాన్ పై యుద్దం ప్రకటించాలని డిమాండ్ పెరుగుతోంది.
Also Read : India-Pakistan Ceasefire Sensational :భారత్..పాకిస్తాన్ దేశాల కాల్పుల విరమణ