ఇండిగో ఫ్లైట్ కు ఛాన్స్ ఇవ్వ‌ని పాకిస్తాన్

గ‌గ‌న త‌లంలో చోటుకు తిర‌స్క‌ర‌ణ

న్యూఢిల్లీ – పాకిస్తాన్ త‌న తీరు మార్చుకోవ‌డం లేదు. కావాల‌ని క‌య్యానికి కాలు దువ్వుతోంది. ఇప్ప‌టికే భార‌త్ కొట్టిన దెబ్బ‌కు విల విల లాడుతోంది. ఓ వైపు నీళ్లు లేక ఇంకో వైపు ఆర్మీపై దెబ్బ ప‌డ‌డంతో ఏం చేయాలో పాలు పోవ‌డం లేదు. ఇదే స‌మ‌యంలో కాల్పుల విర‌మ‌ణ‌కు ఓకే అంటూనే ఇంకో వైపు ఉగ్ర‌వాదుల‌ను భార‌త్ లోకి పంపించే ప్ర‌య‌త్నం చేస్తోంది. ప్ర‌పంచంలోనే అత్య‌ధికంగా ఉగ్ర‌వాదాన్ని స‌పోర్ట్ చేస్తున్న కంట్రీగా ఈ కంత్రీ పాకిస్తాన్ కు పేరుంది. అయినా దానికి బుద్ది రావ‌డం లేదు.

తాజాగా ఇండియాలోని ఢిల్లీ నుంచి కాశ్మీర్ కు 220 మంది ప్ర‌యాణీకుల‌తో ఇండిగో విమానం బ‌య‌లు దేరింది. ఈ స‌మ‌యంలో భారీ ఎత్తున వ‌డ‌గ‌ళ్లు ప‌డ్డాయి. ఈ అల్ల‌క‌ల్లోలం నుంచి నివారించేందుకు పాకిస్తాన్ గ‌గ‌న త‌లాన్ని ఉప‌యోగించు కునేందుకు ఇండిగో పైల‌ట్ పాకిస్తాన్ ను అభ్య‌ర్థించాడు. అయితే దీనికి ఒప్పుకోలేదు ఆ దేశం. త‌న క‌ర్క‌శ‌త్వాన్ని మ‌రోసారి ప్ర‌ద‌ర్శించింది. ఈ మేర‌కు లాహోర్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ అనుమ‌తి కోరాడు. ఒప్పుకునేది లేదంటూ అటు వైపు నుంచి స‌మాధానం వ‌చ్చింద‌ని స‌ద‌రు పైల‌ట్ వెల్ల‌డించాడు.

దీనిని కేంద్ర ప్ర‌భుత్వ వ‌ర్గాలు కూడా ధ్రువీక‌రించాయి. ఈ ఘ‌ట‌న‌కు సంబంధించి డైరెక్ట‌రేట్ జ‌న‌ర‌ల్ ఆఫ్ ఏవియేష‌న్ ప‌రిశీలిస్తోంద‌ని పేర్కొన్నాయి. పైల‌ట్ స‌మ‌య స్పూర్తితో శ్రీ‌న‌గ‌ర్ లోని ఎయిర్ పోర్ట్ లో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ కు అత్య‌వ‌స‌ర ప‌రిస్థితిని వివ‌రించాడు. దీంతో అక్క‌డ విమానం సేఫ్ గా ల్యాండ్ అయ్యింది. పెహ‌ల్గామ్ ఘ‌ట‌న త‌ర్వాత పాకిస్తాన్ త‌న గ‌గ‌న త‌లాన్ని మూసి వేసింది.

Leave A Reply

Your email address will not be published.

Social Media Auto Publish Powered By : XYZScripts.com