ఈ ఏడాది పవర్ స్టార్ ఫ్యాన్స్ కు పూనకాలు తెప్పించేలా రెండు భారీ బడ్జెట్ తో తీసిన సినిమాలు రాబోతున్నాయి. జయకృష్ణ దర్శకత్వంలో ఎంఎం రత్నం నిర్మించిన హరి హర వీరమల్లు మూవీ జూన్ 12న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇప్పటికే ఈ సినిమా గురించి భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇదే సమయంలో తను నటిస్తున్న మరో చిత్రం ఓజీ. షూటింగ్ లో బిజీగా పాల్గొంటున్నాడు పవన్ కళ్యాణ్. ఇప్పటికే రిలీజ్ చేసిన పోస్టర్ కెవ్వు కేక అనిపించేలా ఉంది.
తాజాగా ఓజీ మూవీ గురించి కీలక అప్ డేట్ ఇచ్చారు మూవీ మేకర్స్. ఈ మేరకు సంచలన ప్రకటన చేశారు. పవన్ కళ్యాణ్ ఓజీ ప్రపంచ వ్యాప్తంగా సెప్టెంబర్ 15న దసరా కానుకగా విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. దీంతో అభిమానులు పండుగ చేసుకుంటున్నారు. డిఫరెంట్ మేనరిజంతో తనకంటూ స్పెషల్ ఇమేజ్ స్వంతం చేసుకున్నాడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఈ సినిమా పూర్తిగా గ్యాంగ్ స్టర్ నేపథ్యంతో తెరకెక్కుతోంది.
కాగా ఓజీ సినిమా స్టార్ట్ అయి ఏళ్లు గడుస్తున్నా అప్ డేట్ లేక పోవడంతో ఫ్యాన్స్ కొంత నిరాశకు గురయ్యారు. విషయం తెలుసుకున్న మేకర్స్ ఖుష్ కబర్ చెప్పారు. పవర్ స్టార్ స్టామినా ఏమిటో తెలుసు కోవాలంటే తప్పకుండా ఓజీ చూడాల్సిందేనంటూ పేర్కొన్నారు. భారతీయ సినీ చరిత్రలో ఇలాంటి మూవీ రాబోదని అన్నారు. మొత్తంగా ఓజీ సెన్సేషన్ సృష్టించడం ఖాయమని పేర్కొంటున్నారు.