మూవీ పోస్ట్ పోన్ రెమ్యున‌రేష‌న్ రిట‌ర్న్

రూ. 11 కోట్లు నిర్మాత ర‌త్నంకు ప‌వ‌న్ వాప‌స్

టాలీవుడ్ స్టార్ హీరో, ఏపీ డిప్యూటీ సీఎం కొణిద‌ల ప‌వ‌న్ క‌ళ్యాణ్ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. ఎంఎం ర‌త్నం తీసిన హ‌రి హ‌ర వీర‌మ‌ల్లు సినిమాలో న‌టించినందుకు గాను త‌న‌కు పారితోష‌కంగా ఇచ్చిన రూ. 11 కోట్ల రూపాయ‌ల‌ను తిరిగి ఇచ్చేస్తున్న‌ట్లు వెల్ల‌డించారు. వాస్త‌వానికి జూన్ 12న ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌ల కావాల్సి ఉంది హ‌రి హ‌ర వీర‌మ‌ల్లు మూవీ. ఇప్ప‌టి వ‌ర‌కు ప్రీ ప్రొడ‌క్ష‌న్స్ పూర్తి కాలేద‌ని స‌మాచారం.

అయినా ఇవేవీ ప‌ట్టించుకోకుండా నిర్మాత ర‌త్నం కీల‌క ప్ర‌క‌ట‌న చేయ‌డం, ప‌వ‌న్ ఫ్యాన్స్ సినిమా రిలీజ్ అవుతుంద‌ని అనుకున్నారు. తీరా చూస్తే అభిమానుల ఆశ‌ల‌పై నీళ్లు చ‌ల్లారు. మ‌రో వైపు డిస్ట్రిబ్యూట‌ర్స్, ఎగ్జిబిట‌ర్స్ తాము థియేట‌ర్ల‌ను బంద్ చేస్తామ‌ని ప్ర‌క‌టించ‌డం, ఇది తీవ్ర వివాదానికి దారి తీయ‌డం, ప‌వ‌న్ క‌ళ్యాణ్ హెచ్చ‌రించ‌డం క‌ల‌క‌లం రేపింది. హ‌రి హ‌ర వీర‌మ‌ల్లుపై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు మాజీ మంత్రి అంబ‌టి రాంబాబు. క‌థ‌లో ద‌మ్ము లేద‌ని, అందుకే ప‌వ‌న్ ఇలాంటి కామెంట్స్ చేస్తున్నారంటూ ఎద్దేవా చేశారు.

ఇది ప‌క్క‌న పెడితే హ‌రి హ‌ర వీర‌మ‌ల్లు చిత్రం చారిత్రాక నేప‌థ్యంతో కూడుకుని ఉన్న‌ది. 17వ శ‌తాబ్దంలోని మొగలుల సామ్రాజ్యంలో వ‌జ్రాన్ని తీసుకు వ‌చ్చే యోధుడు వీర‌మ‌ల్లు పాత్ర‌ను చేస్తున్నాడు ప‌వ‌న్ క‌ళ్యాణ్. త‌న‌కు జోడీగా నిధి అగ‌ర్వాల్ న‌టించింది. ముందుగా క‌థ‌, స్క్రీన్ ప్లే, ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు క్రిష్ జాగ‌ర్ల‌మూడి. ఏమైందో ఏమో కానీ త‌ను ప్రాజెక్టు నుంచి త‌ప్పుకున్నాడు.

తీరా సినిమా చాలా ఆల‌స్య‌మైంది. ఏపీలో ఎన్నిక‌లు రావ‌డంతో ప‌వ‌న్ గ్యాప్ ఇచ్చాడు. చివ‌ర‌కు ర‌త్నం సోద‌రుడి త‌న‌యుడు జ్యోతి కృష్ణ ఎలాగోలా క‌ష్ట‌ప‌డి సినిమా పూర్తి చేశాడు. అయితే డేట్ ఫిక్స్ చేశాక వాయిదా వేస్తున్న‌ట్లు చెప్ప‌డంతో ఉత్కంఠ నెల‌కొంది.

Leave A Reply

Your email address will not be published.

Social Media Auto Publish Powered By : XYZScripts.com